ఆన్లైన్ ఆటలతో ఒత్తిడి దూరం
లాక్డౌన్, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనల వల్ల బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో చాలామంది అన్లైన్ గేమింగ్పై ఆసక్తి చూపుతున్నారు.
ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ అధ్యయనాల వెల్లడి
దిల్లీ: లాక్డౌన్, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనల వల్ల బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో చాలామంది అన్లైన్ గేమింగ్పై ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ చేపట్టిన అధ్యయనంలో ప్రజలు ఆన్లైన్ గేముల్ని డబ్బు సంపాదించడానికి, జీవన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఆడుతున్నారనే కొత్త విషయాలు వెలుగుచూశాయి. 18 నుంచి 44 ఏళ్ల మధ్యన ఉండి, అన్లైన్ గేమ్స్ ఆడే 2,400 మంది భారతీయులపై నిర్వహించిన అధ్యయనంలో 26 శాతం మంది ఒత్తిడి తగ్గించుకోవడానికి, 24 శాతం మంది డబ్బు సంపాదించడానికి, 13 శాతం మంది జీవన నైపుణ్యాలను, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆన్లైన్ గేములు ఆడుతున్నట్టు తేలింది.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రోలాండ్ లాండర్స్ మాట్లాడుతూ ‘‘జీవితంలో ఎదుగుదలకు సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్యలను పరిష్కరించడం, ఆపత్కాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం లాంటి విభిన్న నైపుణ్యాలు ఎంతో అవసరం. ఈ పరిశోధన ద్వారా వినియోగదారులు మొబైల్ గేమింగ్ విలువలను నిజంగా గ్రహిస్తారా లేదా అని అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నించాం. ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది’’ అని అన్నారు.
ఆన్లైన్ ఆటలు ఆడేవాళ్లు ఓ ఆటను గెలవడానికి ఉత్తమ మార్గాన్ని కనిపెట్టడం ద్వారా విశ్లేషణాత్మక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని నమ్ముతున్నారు. ఆన్ లైన్ గేమింగ్ నైపుణ్యాలు నిజ జీవితంలో ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు. వాటిని ఆడేవాళ్లు నిజ జీవిత సంబంధాలతో పోలిస్తే, ఆన్ లైన్ గేమింగ్ సహచరులతోనే మరింత అనుకూలమైన వైఖరిని ప్రదర్శిస్తారని పరిశోధకులు వెల్లడించారు. సహోద్యోగులతో కంటే గేమింగ్ సహచరులతోనే నిజాయతీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. వీళ్లలో 70 శాతం మందికి పైగా ఆన్లైన్ గేమ్స్ ద్వారా డబ్బులు సంపాదించడానికి మొబైల్ ఫోన్ ఎంచుకుంటున్నారని పరిశోధకులు తెలిపారు. ఈ గేమ్స్ ద్వారా నెలకు 5 వేల నుంచి 45 వేల రూపాయల వరకు సంపాదించవచ్చనీ, ఒక గేమర్ లేదా టీమ్.. గేమింగ్ టోర్నమెంట్లలో 4.5 లక్షల వరకూ ప్రైజ్ మనీ పొందే అవకాశం ఉందని పరిశోధనలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434