Droupadi Murmu: మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ము.. వీడియో వైరల్
President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిల్లీ మెట్రోలో ప్రయాణించారు. సామాన్య ప్రయాణికుల వలే మెట్రో రైల్లో కూర్చుని విద్యార్థులతో ముచ్చటించారు.
దిల్లీ: నిత్యం రద్దీగా ఉండే దేశ రాజధాని దిల్లీలోని మెట్రో రైల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ప్రయాణించారు. ఆమెను చూసిన ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలారు. భారీ భద్రతతో కూడిన కాన్వాయ్ను వదిలి సామాన్యురాలిలా కొంతసేపు మెట్రో రైలు (Metro Rail)లో ప్రయాణించారు. విద్యార్థులతో ముచ్చటించారు. రైల్లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ వికాస్ కుమార్ ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhawan)కు సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ను ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మెట్రో పనితీరు, ఇతర వివరాలను డీఎంఆర్సీ ఎండీ వికాస్ కుమార్ రాష్ట్రపతికి వివరించారు. అనంతరం కొంతదూరం మెట్రో రైలులో ప్రయాణించారు.
కుమార్తె పెళ్లిలో అతిథులకు హెల్మెట్లు పంచిన తండ్రి
అమృత్ ఉద్యాన్గా పేరు మార్చిన మొఘల్ గార్డెన్స్తో పాటు రాష్ట్రపతి భవన్లోని ఇతర ఉద్యానవనాలను ప్రజలు సందర్శించేందుకు వీలుగా ‘అమృత్ ఉద్యాన్-2024 (Amrit Udyan)’ను ఇటీవల ప్రారంభించారు. మార్చి 31 వరకు ఇది ప్రజలకు అందుబాటులో ఉండనుంది. దీని సందర్శనకు వెళ్లే పర్యటకుల కోసం దిల్లీ మెట్రో ఉచిత సేవలు ప్రారంభించింది. సెంట్రల్ సెక్రటేరియట్ నాలుగో గేటు నుంచి ప్రయాణికులు ఉచితంగా రాష్ట్రపతి భవన్కు వెళ్లొచ్చని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం