India-China: చైనా-భారత్ రక్షణ మంత్రులు భేటీ.. తూర్పు లద్దాఖ్పై చర్చలు..?
భారత్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO Meet) సమావేశంలో పాల్గొనేందుకు చైనా రక్షణశాఖ మంత్రి లీ షాంగ్ఫు భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు.
దిల్లీ: భారత్(India), చైనా (China) సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఇరు దేశాల సైనికాధికారుల మధ్య అనేక దఫాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్కు వచ్చిన చైనా రక్షణశాఖ మంత్రి జనరల్ లీ షాంగ్ఫుతో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) భేటీ అయ్యారు. తూర్పు లద్దాఖ్లోని (Eastern Ladakh) సరిహద్దు వివాదంపై వీరిద్దరు చర్చలు జరిపినట్లు సమాచారం. మూడేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్లో ఘర్షణ జరిగిన అనంతరం చైనా రక్షణమంత్రి భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఈ ఏడాది షాంఘై సహకార సంస్థ (SCO Meet) సమావేశాలు భారత్లో జరుగుతున్నాయి. ఈ సదస్సులో భాగంగా రక్షణశాఖ మంత్రుల (Defence Ministers) సమావేశానికి హాజరయ్యేందుకు చైనా రక్షణమంత్రి లీ షాంగ్ఫు గురువారం దిల్లీకి చేరుకున్నారు. అనంతరం ఆయన భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్తో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ఏవిధమైన చర్చలు జరిగాయనే విషయంపై అధికారక ప్రకటన రాలేదు. అయితే, తూర్పులద్దాఖ్పై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక చైనా రక్షణమంత్రితోపాటు ఇరాన్, తజకిస్థాన్, కజకిస్థాన్ దేశాల రక్షణ మంత్రులతోనూ రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. పాకిస్థాన్ రక్షణమంత్రి మాత్రం ఈ సమావేశాలకు హాజరు కావడం లేదు.
భారత్-చైనా సైనికాధికారుల మధ్య 18వ దఫా చర్చలు ఏప్రిల్ 23న జరిగాయి. తూర్పులద్దాఖ్లో నెలకొన్న ప్రతిష్టంభనను పరస్పర ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించుకోవాలని రెండు దేశాల సైనిక ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే భారత్-చైనా రక్షణ మంత్రుల భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు గోవాలో వచ్చేవారం జరిగే ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ కూడా భారత్ రానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!