Herd Immunity: హెర్డ్ ఇమ్యూనిటీ కోసం డెల్టా బారిన పడాల్సిందే.. లేదా..!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడేందుకు సహకరించే హెర్డ్ ఇమ్యూనిటీ.....
దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడేందుకు సహకరించే హెర్డ్ ఇమ్యూనిటీ (Herd Immunity) దేశ రాజధాని దిల్లీలో చాలా కష్టమని నిపుణుల బృందం స్పష్టం చేసింది. కొవిడ్ రెండో దశ దిల్లీని కకావికలం చేసిందని.. అక్కడ హెర్డ్ ఇమ్యూనిటీ ఇప్పట్లో కష్టమేనని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తేల్చి చెప్పింది. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు డెల్టా బారిన పడటం లేదా.. బూస్టర్ డోసు తీసుకోవడం మాత్రమే మార్గమమని స్పష్టం చేసింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), కేంబ్రిడ్జి యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, కోపెన్హాగెన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సహా మరికొందరు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు.
2020లో దిల్లీలో కరోనా విజృంభణకు కారణమైన వేరియంట్ను కచ్చితంగా చెప్పలేమన్న బృందం.. కొన్ని కేసుల్లో ఆల్ఫా వేరియంట్ బయటపడిందని పేర్కొంది. అది కూడా ఎక్కువగా విదేశీ ప్రయాణికుల్లోనని తెలిపింది. అయితే 2021 మార్చి నాటికి దిల్లీలో ఈ వేరియంట్ కేసులు 40 శాతం వెలుగుచూశాయని.. అనంతరం ఏప్రిల్లో డెల్టా విజృంభించిందని వివరించింది. కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్త రవి గుప్తా మాట్లాడుతూ.. ‘అంటువ్యాధులను అంతం చేయడంతో హెర్డ్ ఇమ్యూనిటీ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ దిల్లీ వాసులపై గత వేరియంట్లు చూపిన ప్రభావం ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు సరిపోదు. ఇది సాధించేందుకు ఉన్న మార్గం డెల్టా వేరియంట్ సోకి దాని నుంచి కోలుకోవడం లేదా.. బూస్టర్ డోసు ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం’ అని పేర్కొన్నారు.
2020 నవంబర్లో రాజధాని దిల్లీలో ప్రతిరోజు దాదాపు 9వేల కొవిడ్ కేసులు నమోదయ్యేవి. డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్యలో ఆ సంఖ్య తగ్గింది. కానీ మరుసటి నెల నుంచి పరిస్థితులు మారిపోయాయి. మార్చిలో 2వేలుగా నమోదైన కేసులు ఏప్రిల్లో 20వేలకు పెరిగిపోయాయి. అనంతరం రోజూ వేలల్లో కేసులు నమోదవుతూ వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు లభించక ఆసుపత్రి ఆవరణలోనే ప్రాణాలు పోయిన ఘటనలు ఎన్నో. కాగా దిల్లీలో ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!