Republic Day: గణతంత్ర వేడుకలల్లో 1000 డ్రోన్లతో ప్రదర్శన
గణతంత్ర వేడుకల్లో భాగంగా దిల్లీలో నిర్వహించే బీటింగ్ రిట్రీట్లో ఈసారి 1000 డ్రోన్లతో ప్రదర్శన ఉండనుంది. ఐఐటీ దిల్లీకి చెందిన ‘బోట్ల్యాబ్ డైనమిక్స్’ అనే అంకుర సంస్థ......
దిల్లీ: గణతంత్ర వేడుకల్లో భాగంగా దిల్లీలో నిర్వహించే బీటింగ్ రిట్రీట్లో ఈసారి 1000 డ్రోన్లతో ప్రదర్శన ఉండనుంది. ఐఐటీ దిల్లీకి చెందిన ‘బోట్ల్యాబ్ డైనమిక్స్’ అనే అంకుర సంస్థ దీన్ని నిర్వహించనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా ఈ ప్రదర్శనను రూపొందిస్తున్నారు.
అంతేకాకుండా తొలిసారి నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ గోడలపై లేజర్ షో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీటింగ్ రీట్రీట్లో డ్రోన్ల ప్రదర్శన, లేజర్ షో ఉండటం ఇదే మొట్టమొదటి సారి అని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరే నాలుగో దేశంగా భారత్ నిలువనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను జనవరి 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
శకటాలపై రాజకీయ దుమారం..
గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే శకటాలపై ఈసారి రాజకీయ దుమారం చెలరేగింది. తమ శకటాలను ప్రదర్శించాలని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిని రక్షణ శాఖ తిరస్కరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్లు ప్రధానిని కోరినప్పటికీ.. నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. బెంగాల్ శకటాన్ని 2016, 2017, 2019, 2021 గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించామని, ఈ సారి 12 రాష్ట్రాలకే ఆ అవకాశం కల్పిస్తున్నామని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్.. మమతా బెనర్జీకి లేఖ ద్వారా సమాధానమిచ్చారు. ఇదే తరహాలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా రాజ్నాథ్ లేఖ పంపారు.
ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 9 కేంద్ర శాఖలకు చెందిన శకటాలను మాత్రమే ప్రదర్శిస్తున్నారు. అరుణాచల్ప్రదేశ్, హరియాణా, గోవా, గుజరాత్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రత్యేకతలకు సంబంధించిన శకటాలు ప్రదర్శిస్తాయి. తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు ఈ సారి కూడా అవకాశం లభించలేదు. విద్యా-నైపుణ్యాభివృద్ధి, విమానయానం, తపాలా, హోం, జలశక్తి, సాంస్కృతిక శాఖల శకటాలకు అవకాశం ఇస్తున్నట్లు రక్షణశాఖ పేర్కొంది. మొత్తం 56 శకటాలకు ప్రతిపాదనలు రాగా.. 21 శకటాలను ఖరారు చేసినట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో పవన్ విజయానికి కృషి చేస్తా: ముద్రగడ కుమార్తె క్రాంతి
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్