Agnipath: ‘అందుకోసమేనా నాలుగేళ్ల సర్వీసు?’.. కేంద్రాన్ని ప్రశ్నించిన శత్రుఘ్న సిన్హా
‘అగ్నిపథ్’ పథకం ద్వారా సమర్థవంతమైన వారిని నియమిస్తే కేవలం నాలుగేళ్ల తర్వాత వారిని ఎలా రిటైర్ చేస్తారని
దిల్లీ: ‘అగ్నిపథ్’ (Agnipath) పథకం ద్వారా సమర్థమైన వారిని నియమిస్తే కేవలం నాలుగేళ్ల తర్వాత వారిని ఎలా రిటైర్ చేస్తారని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ శత్రుఘ్న సిన్హా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పథకం లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అశావాహులు నిరసనలు చేస్తున్నారని.. అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి సిన్హా పలు ప్రశ్నలు సంధించారు.
‘అగ్నివీరులను నాలుగేళ్ల తర్వాత తొలగించి భాజపా కార్యాలయాల ముందు సెక్యూరిటీ గార్డ్స్లా నియమించుకుంటారా? అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ ఆర్మీలోని మాజీ సైనికాధికారులు మాట్లాడటం నేనూ చూశాను. సైన్యంలో పనిచేస్తున్న జవాన్ల పదవీ విరమణ వయసు 58 ఏళ్లు ఉండాలని దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ గతంలోనే అన్నారు. ఇప్పుడేమో వేరే ట్యూన్. వేరే టోన్. ఎందుకిలా? వాళ్లు మన దేశంలోనే నివసించే వారే కదా. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్లనే కాదు వారి కుటుంబాలను కూడా’ అని సిన్హా అన్నారు.
సాయుధ దళాల సిబ్బంది, అధికారుల స్థాయి కంటే తక్కువ ఉన్న వారి పదవీ విరమణ వయసు 37-38 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు పొడిగించాలని దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ చెప్పిన మాటలను సిన్హా ఉటంకించారు. జవాన్లు కేవలం 15 లేదా 17 ఏళ్లే సర్వీస్లో ఎందుకుండాలని, వారు 30 ఏళ్లు ఎందుకు సేవ చేయకూడదని బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారని చెప్పారు. శిక్షణ పొందిన సైనికులు తొందరగా రిటైర్ అవ్వకూడదని ఆయన వ్యాఖ్యానించారని సిన్హా గుర్తుచేశారు.
సైనికుల పెన్షన్ వ్యయాన్ని పాక్షికంగా తగ్గించడానికే షార్ట్ టర్మ్ రిక్రూట్మెంట్ స్కీమ్ (అగ్నిపథ్)ను తీసుకొచ్చారని సిన్హా విమర్శించారు. నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందినే శాశ్వత నియామకాల్లో తీసుకుంటామనడంపైనా మండిపడ్డారు. ‘‘ఈ 25 శాతం మంది ఎవరు? వాళ్లు మీ సొంత మనుషులా? మీరు ఇష్టపడే బంధువులా’’ అని సిన్హా ప్రశ్నించారు. నాలుగేళ్ల సర్వీస్పైనా ప్రశ్నిస్తూ.. ‘‘నాలుగేళ్ల సర్వీసే ఎందుకు? ఐదేళ్లు ఎందుకు కాకూడదు? దీనివల్ల కొంత గ్రాట్యుటీని ఆదా చేయడం కోసమేనా?’’ అని కేంద్రాన్ని నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434