Modi: పెట్రోల్పై ఆ రాష్ట్రాలు పన్ను తగ్గించట్లేదు.. ఇంధన ధరలపై తొలిసారి స్పందించిన మోదీ
దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ
దిల్లీ: దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం పన్నులపై వెనక్కి తగ్గట్లేదని దుయ్యబట్టారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ట్రాలు ఇంధన ధరలపై పన్నులను తగ్గించాలని కోరారు.
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంధన ధరల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘గతేడాది నవంబరులో ఇంధన ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని కోరాం. కానీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు మా మాట వినలేదు. కారణమేదైనా పన్నులు తగ్గించలేదు. నేను ఎవర్నీ విమర్శించట్లేదు. కానీ, ఇకనైనా ఆయా రాష్ట్రాలు సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇంధన ధరలపై వ్యాట్ను తగ్గించాలని కోరుతున్నా’’ అని మోదీ తెలిపారు.
‘నాలుగో వేవ్’ భయాలపై మోదీ సూచనలు..
సమావేశంలో భాగంగా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ సీఎంలతో చర్చించారు. గత రెండు వారాలుగా కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున మనమంతా అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, వైరస్ వ్యాప్తిని అరికట్టేలా మాస్క్ల వినియోగం, భౌతిక దూరం వంటి నిబంధనలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. టెస్ట్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా రాష్ట్రాలు అప్రమత్తం కావాలని ప్రధాని తెలిపారు. మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని పెంచాలన్నారు. ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.
అర్హులైన పిల్లలందరికీ వ్యాక్సినేషన్..
ఈ సందర్భంగా దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మోదీ ప్రశంసలు కురిపించారు. దేశంలో 96 శాతం మంది వయోజనులకు కనీసం ఒక డోసు అందడం.. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని కొనియాడారు. అర్హులైన ప్రతి చిన్నారికి వ్యాక్సినేషన్ అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. మార్చి నుంచి 12-14 ఏళ్ల వారికి కూడా టీకాలు అందిస్తోన్న విషయాన్ని గుర్తు చేశారు. 6-12 ఏళ్ల వయసు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేలా రెండు టీకాలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. పిల్లలకు టీకా పంపిణీపై తల్లిదండ్రులకు, చిన్నారులకు అవగాహన కల్పించాలని ప్రధాని రాష్ట్రాలకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434