రష్యా వ్యక్తికి తెలిసింది.. కేంద్రానికి తెలియదా..?
భారత్లోని వ్యాక్సిన్ తయారీ సంస్థల గురించి రష్యాలో ఉన్న వ్యక్తికి తెలిసిన విషయం కేంద్రానికి తెలియదా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
వ్యాక్సిన్ కొరతపై దిల్లీ హైకోర్టు ఆవేదన
దిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఏర్పడడం పట్ల దిల్లీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ను ఎదుర్కొనడంలో అందరకీ వ్యాక్సిన్ అందించడం ఒక్కటే ఉత్తమ మార్గమని చెబుతున్నప్పటికీ.. ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. అంతేకాకుండా భారత్లోని వ్యాక్సిన్ తయారీ సంస్థల గురించి రష్యాలో ఉన్న వ్యక్తికి తెలిసిన విషయం కేంద్రానికి తెలియదా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సుత్నిక్ వ్యాక్సిన్ను భారత్లో తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పనేషియా బయోటెక్కు సంబంధించిన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టు ఈ విధంగా స్పందించింది.
‘సెకండ్ వేవ్ సమయంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. బాధ్యతగల పౌరుడిగా మీకు కూడా అదే ఆవేదన ఉంటుంది. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ కొరత ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. ఈరోజు కూడా దిల్లీలో వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దేశంలో ఎన్నో మంచి ఉత్పత్తులు ఉన్నాయి. వాటికి చిన్నపాటి చేయూత ఇస్తే చాలు’ అని పనేషియా పిటిషన్ విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టు బెంచ్ పేర్కొంది. అంతేకాకుండా ‘ఎక్కడో రష్యాలో ఉన్న ఓ వ్యక్తి హిమాచల్లో ఉన్న వ్యాక్సిన్ తయారీ సంస్థను గుర్తించగలిగారు. కానీ, అలా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యింది’ అని స్పష్టంచేసింది. దేశంలో వనరులున్నప్పటికీ వ్యాక్సిన్ తయారీలో వాటిని కేంద్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
ఇన్ఫ్లూయోంజా వ్యాక్సిన్ తయారీకి సంబంధించి 2010లో ఓ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై పనేషియా బయోటెక్ హైకోర్టును ఆశ్రయించింది. 2019లో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాలని కోరింది. దీంతో విచారణ చేపట్టిన దిల్లీ హై కోర్టు.. పనేషియా బయోటెక్కు రూ.14కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాకుండా 2012 నుంచి ఇప్పటివరకు ఏడాదికి 12శాతం వడ్డీని కలిపి చెల్లించాలని పేర్కొంది. తాజాగా ఈ పిటిషన్ విచారణ సందర్భంగా దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై దిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434