మమత పిటిషన్ విచారణకు సుప్రీం జడ్జి నో!
పశ్చిమ బెంగాల్కు చెందిన నారదా కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేసిన పిటిషన్ల విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుధా బోస్ తప్పుకున్నారు. కోల్కతాకు చెందిన ఆయన
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన నారదా కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేసిన పిటిషన్ల విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధా బోస్ తప్పుకున్నారు. కోల్కతాకు చెందిన ఆయన ‘ఈ కేసులో వాదనలు వినాలనుకోవడం లేదు’ అని ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్లపై విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని మరో న్యాయమూర్తి జస్టిస్ హేమంత గుప్తా సుప్రీంకోర్టు రిజిస్ట్రీని కోరారు. ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన మరో కేసు విచారణ నుంచి సైతం జస్టిస్ ఇందిరా బెనర్జీ ఇటీవలే తప్పుకున్నారు. ఈమె కూడా కోల్కతాకు చెందినవారే. ఇలా బెంగాల్కు సంబంధించిన కేసుల నుంచి న్యాయమూర్తులు వరుసగా తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
2014లో పశ్చిమబెంగాల్లో నారదా స్టింగ్ ఆపరేషన్ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఇటీవల అదుపులోకి తీసుకుంది. అనంతరం వారు బెయిల్పై విడుదలయ్యారు. అయితే, వీరి అరెస్టును నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయంలో ఒక రోజంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను బెంగాల్ వెలుపలకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడిలో కేసు విచారణ సజావుగా సాగించలేమని వాదించింది.
సీబీఐ అభ్యర్థనను తప్పుబట్టిన ముఖ్యమంత్రి.. కేసును బెంగాల్ వెలుపలకు తరలించొద్దని హైకోర్టును కోరారు. ఈ మేరకు తమ వాదనను వినిపించేందుకు వీలుగా ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మమతా బెనర్జీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో దీదీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.