మమత పిటిషన్ విచారణకు సుప్రీం జడ్జి నో!
పశ్చిమ బెంగాల్కు చెందిన నారదా కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేసిన పిటిషన్ల విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుధా బోస్ తప్పుకున్నారు. కోల్కతాకు చెందిన ఆయన
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన నారదా కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేసిన పిటిషన్ల విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధా బోస్ తప్పుకున్నారు. కోల్కతాకు చెందిన ఆయన ‘ఈ కేసులో వాదనలు వినాలనుకోవడం లేదు’ అని ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్లపై విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని మరో న్యాయమూర్తి జస్టిస్ హేమంత గుప్తా సుప్రీంకోర్టు రిజిస్ట్రీని కోరారు. ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన మరో కేసు విచారణ నుంచి సైతం జస్టిస్ ఇందిరా బెనర్జీ ఇటీవలే తప్పుకున్నారు. ఈమె కూడా కోల్కతాకు చెందినవారే. ఇలా బెంగాల్కు సంబంధించిన కేసుల నుంచి న్యాయమూర్తులు వరుసగా తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
2014లో పశ్చిమబెంగాల్లో నారదా స్టింగ్ ఆపరేషన్ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఇటీవల అదుపులోకి తీసుకుంది. అనంతరం వారు బెయిల్పై విడుదలయ్యారు. అయితే, వీరి అరెస్టును నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయంలో ఒక రోజంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను బెంగాల్ వెలుపలకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడిలో కేసు విచారణ సజావుగా సాగించలేమని వాదించింది.
సీబీఐ అభ్యర్థనను తప్పుబట్టిన ముఖ్యమంత్రి.. కేసును బెంగాల్ వెలుపలకు తరలించొద్దని హైకోర్టును కోరారు. ఈ మేరకు తమ వాదనను వినిపించేందుకు వీలుగా ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మమతా బెనర్జీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో దీదీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/06/2023)
-
General News
Ts News: మంత్రి గంగులతో చర్చలు సఫలం.. సమ్మె నుంచి వెనక్కి తగ్గిన రేషన్ డీలర్లు
-
Movies News
Paiyaa: 13 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్.. దానికి సీక్వెల్ కాదట!
-
Sports News
Mitchell Starc: ఆ కారణం వల్లే ఐపీఎల్కు దూరంగా ఉంటున్నా: మిచెల్ స్టార్క్
-
India News
AIIMS: సర్వర్పై సైబర్ దాడికి యత్నించారని ఎయిమ్స్ ట్వీట్.. అదేం లేదంటూ కేంద్రమంత్రి క్లారిటీ!
-
Movies News
Adipurush: ఇక ఏడాదికి రెండు సినిమాలు.. పెళ్లిపైనా స్పందించిన ప్రభాస్!