PM Modi: మోదీ ఆస్తుల్లో స్వల్ప పెరుగుదల
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల్లో స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది. 2020లో రూ.2.85 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తుల విలువ రూ.22 లక్షలు పెరిగి.. రూ.3 కోట్ల 7 లక్షలకు చేరింది. తన తాజా డిక్లరేషన్లో మోదీ ఈ వివరాలు పేర్కొన్నారు. చాలా మంది కేంద్ర మంత్రుల్లానే ప్రధానికి కూడా స్టాక్ ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల్లో స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది. 2020లో రూ.2.85 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తుల విలువ రూ.22 లక్షలు పెరిగి.. రూ.3 కోట్ల 7 లక్షలకు చేరింది. తన తాజా డిక్లరేషన్లో మోదీ ఈ వివరాలు పేర్కొన్నారు. చాలా మంది కేంద్ర మంత్రుల్లానే ప్రధానికి కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లేవు. ప్రభుత్వం నుంచి పొందే జీతమే ఆయనకు ముఖ్య ఆదాయ వనరు. ఆ జీతాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటిపై వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(రూ.8.9 లక్షలు), ఎల్ఐసీ పాలసీలు(1.5 లక్షలు), ఎల్అండ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్లో మోదీకి (2012లో రూ.20 వేలకు కొనుగోలు చేశారు) పెట్టుబడులు ఉన్నాయి. గుజరాత్ గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో మోదీ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ విలువే ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ఫిక్స్డ్ డిపాజిట్ విలువ రూ.1.6 కోట్లు ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి అది రూ.1.86 కోట్లకు చేరింది. ప్రధానికి సొంత వాహనం సైతం లేదు.
వాజ్పేయీ నుంచి మొదలు..
ప్రజాజీవితంలో పారదర్శకత కోసం ఆస్తుల వెల్లడి ప్రక్రియను.. 2004లో వాజ్పేయీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి వివిధ హోదాల్లోని రాజకీయనేతలు వారి ఆస్తులు, అప్పులను వెల్లడిస్తున్నారు. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సమయంలో కూడా ప్రమాణపత్రంలో ఈవివరాలను పేర్కొంటారు. లోక్పాల్, లోకాయుక్త చట్టం(2013) ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు అదరూ వారి వార్షిక ఆదాయాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుంది.
ఇంకా ఏమేం ఉన్నాయంటే.. (2021 మార్చి 31 నాటికి)
మోదీ వద్ద నాలుగు బంగారపు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1.48 లక్షలు. బ్యాంక్లో నిల్వ రూ.1.5 లక్షలు. నగదు రూపంలో రూ.36 వేలు ఉన్నాయి. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటివరకు మోదీ ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదు. 2002లో కొనుగోలు చేసిన ఓ స్థిరాస్తి విలువ రూ. 1.1 కోట్లుగా ఉంది. ఇది ఉమ్మడి ఆస్తి. మరో ముగ్గురికి ఇందులో వాటా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?