Aashna Lidder: ‘పరిపూర్ణ దేశం కోసం.. అసంపూర్ణంగా మిగిలే కుటుంబాలు..!’
ఒక పరిపూర్ణ దేశంకోసం.. అసంపూర్ణంగా మిగిలే కుటుంబాలు..ఈ వాక్యం దేశం కోసం అలవోకగా ప్రాణాలు అర్పించే సైనికుడి కుటుంబాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి.
ఆష్నా కొద్ది రోజుల కిందట చెప్పిన మాటలు..తనకే ఎదురయ్యాయి
దిల్లీ: ఒక పరిపూర్ణ దేశంకోసం.. అసంపూర్ణంగా మిగిలే కుటుంబాలు..ఈ వాక్యం దేశం కోసం అలవోకగా ప్రాణాలు అర్పించే సైనికుడి కుటుంబాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. పైగా ఈ మాటలు అన్నది ఆష్నా లిద్దర్. ఇటీవల తమిళనాడు హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ కుమార్తె ఆమె. ఆమె రాసిన ‘సెల్ఫ్లెస్ ఇండిపెండెన్స్’ అనే కవితలోనివి ఆ మాటలు. వీర సైనికుల త్యాగాలను వర్ణిస్తూ ఆమె రాసిన ఆ వాక్యం.. ఇప్పుడు ఆమె కుటుంబం విషయంలోనే వాస్తవరూపం దాల్చడం అత్యంత విషాదకరం. డిసెంబర్ 3న బుక్ రీడింగ్ సెషన్లో భాగంగా ఆమె చెప్పిన కవితను భారత దేశ మొదటి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
‘బుక్ రీడింగ్ సెషన్లో భాగంగా డిసెంబర్ 3న ఆష్నా లిద్దర్ తన పుస్తకం నుంచి ఈ కవితను చదివి వినిపించింది. ఆ మాటలు వింటుంటే ఏదో చెడుగా అనిపించింది. జీవితం ఎప్పుడూ చిక్కుముడే’ అంటూ కిరణ్ బేడీ బుక్ రీడింగ్ సెషన్ వీడియోను షేర్ చేశారు. తాము చేసిన త్యాగానికి తగిన కృతజ్ఞత లభిస్తుందని కచ్చితంగా తెలీకపోయినా.. ప్రజల కోసం ప్రాణాలు విడిచే సైనికులను ఉద్దేశించి ఈ కవిత రాసినట్లు ఆ సందర్భంలో ఆష్నా వెల్లడించింది. అతడి మృతితో నిర్భయంగా మారిన బిడ్డ గురించి, ఒంటరిగా మిగిలిన భార్య గురించి వివరిస్తుంది.
ఇదిలా ఉండగా.. డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ కూడా మరణించారు. నిన్న అంతిమ సంస్కారాల సమయంలో లిద్దర్ సతీమణి గీతిక, కుమార్తెల వేదన ప్రతిఒక్కరినీ కన్నీరు పెట్టించింది. ఆయనకు అంతా నవ్వుతూ వీడ్కోలు పలుకుదామని గీతిక పలికిన మాటలు ప్రతిఒక్కరినీ ఉద్వేగానికి గురిచేశాయి.
శుక్రవారం లిద్దర్ అంత్యక్రియలు ముగియగా, అంతకంటే ముందు లిద్దర్ శవపేటికను ఆత్మీయంగా చుంబించి.. ఆయన సతీమణి గీతిక వీడ్కోలు పలికారు. పక్కనే ఉన్న కుమార్తె కూడా తన తండ్రి ఇక రారనే ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. ‘నాకు 17 సంవత్సరాలు. అంటే నాకు, మా నాన్నకు మధ్య 17 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయన మాకు మిగిల్చిన అందమైన జ్ఞాపకాలతో మేం ముందుకు వెళ్తాం. ఆయన దూరమవడం.. దేశానికి పూడ్చలేని నష్టం. బహుశా ఇదే విధి అనుకుంటా. నా తండ్రే నాకు హీరో, నా బెస్ట్ ఫ్రెండ్, నా మోటివేటర్’ అంటూ ఆయన కుమార్తె ధైర్యంగా మాట్లాడింది. ‘మేం ఆయనకు గొప్పగా వీడ్కోలు పలకాలి. కన్నీటితో కాకుండా నవ్వుతూ, ప్రశాంతంగా సాగనంపాలి. నేనొక సైనికుడి భార్యను. ఇది పూడ్చలేని నష్టం’ అంటూ లిద్దర్ సతీమణి గీతిక స్పందించారు. తుది వీడ్కోలు సమయంలో వారిద్దరూ గుండె దిటవు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు