Precaution dose: ముందు జాగ్రత్త డోసు.. వృద్ధులకు వెసులుబాటు కల్పించిన కేంద్రం
ముందుజాగ్రత్త( ప్రికాషన్) డోసు విషయంలో వృద్ధులకు కేంద్రం వెలుసుబాటు కల్పించింది. 60 ఏళ్లు పైబడి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ డోసు తీసుకునే ముందు ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ అందిచాల్సిన/అప్లోడ్ చేయాల్సిన పనిలేదని వెల్లడించింది. మంగళవారం రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.
దిల్లీ: ముందుజాగ్రత్త( ప్రికాషన్) డోసు విషయంలో వృద్ధులకు కేంద్రం వెలుసుబాటు కల్పించింది. 60 ఏళ్లు పైబడి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ డోసు తీసుకునే ముందు ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ అందిచాల్సిన/అప్లోడ్ చేయాల్సిన పనిలేదని వెల్లడించింది. మంగళవారం రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.
వైద్యుడి దగ్గరినుంచి తమ అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి పత్రాలు తీసుకురాకపోయినా 60 ఏళ్లు పైబడిన వారు ముందుజాగ్రత్త డోసు తీసుకోవచ్చని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే టీకా తీసుకునే ముందు వారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంది. అలాగే త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందిని కేంద్రం ఫ్రంట్లైన్ వర్కర్లుగా గుర్తించనున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోన్న తరుణంలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటి ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి జనవరి 10 నుంచి ప్రికాషన్ డోసు అందించనున్నట్లు ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో డోసు తీసుకున్న 9 నెలలు లేదా 39 వారాలు దాటిన తర్వాతే ఈ ముందు జాగ్రత్త డోసు స్వీకరించడానికి అర్హత లభిస్తుందని నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి జనవరి మూడు నుంచి టీకా అందించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు