Sputnik Light: స్పుత్నిక్ లైట్.. సింగిల్ డోసు టీకా ఎగుమతికి భారత్ అనుమతి
రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోసు కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-లైట్’ భారత్లో తయారవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా వీటిని రష్యాకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోసు కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-లైట్’ భారత్లో తయారవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా వీటిని రష్యాకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్ రెండు డోసుల్లో టీకా వినియోగానికి భారత్లో అనుమతి ఉన్నప్పటికీ.. సింగిల్ డోసు వినియోగానికి వినియోగంలో లేదు. దీంతో భారత్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందేవరకు ఈ టీకా ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.
రష్యా రూపొందించిన ‘స్పుత్నిక్ లైట్’ వ్యాక్సిన్ను భారత్లో తయారు చేసేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (RDIF) ఇక్కడి హెటెరో బయోఫార్మాతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా హెటెరో బయోఫార్మా వ్యాక్సిన్ ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించింది. ఇదే సమయంలో భారత్లో ఈ టీకా వినియోగానికి అనుమతి పొందనందున వీటిని రష్యాకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ రష్యా విదేశాంగ భారత్ను కోరింది. వారి అభ్యర్థన మేరకు హెటెరో తయారు చేసిన 40లక్షల డోసులను ఎగుమతి చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు భారత్లో స్పుత్నిక్ లైట్ వినియోగ అనుమతి కోసం డాక్టర్ రెడ్డీస్తో కలిసి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
గతకొన్ని నెలలుగా భారత్లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్తోపాటు ఇతర తయారీ సంస్థలు నెలవారీ ఉత్పత్తిని భారీగా పెంచాయి. ఇదే సమయంలో వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా ఇతర దేశాలకు వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసేందుకు తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్లకు 10లక్షల డోసుల చొప్పున కొవిషీల్డ్ వ్యాక్సిన్ను అందజేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కు అనుమతించింది. మరో ప్రముఖ సంస్థ భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ 10లక్షల డోసులను ఇరాన్కు సరఫరా చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితోపాటు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ తయారీ కూడా భారత్లో కొనసాగుతోంది. ఆర్డీఐఎఫ్ సహకారంతో తయారైన స్పుత్నిక్ లైట్ సింగిల్ డోసు టీకా 79శాతం సమర్థత కలిగి ఉన్నట్లు రష్యా ప్రయోగాల్లో వెల్లడైంది. భారత్లో వీటి మూడో దశ ప్రయోగాలను మాత్రం డాక్టర్ రెడ్డీస్ నిర్వహిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం