Corona Vaccine: జులైలో 13 కోట్లకుపైగా డోసులిచ్చాం..!
దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం జులై నెలలోనే 13కోట్లకుపైగా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం జులై నెలలోనే 13కోట్లకుపైగా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా ఆగస్టు నెలలో ఈ ప్రక్రియ మరింత వేగం కానుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కృషికి గర్విస్తున్నామన్నారు. దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ మందకొడిగా సాగుతుందంటూ రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్రమంత్రి ఈ విధంగా స్పందించారు.
‘జులై నెలలో వ్యాక్సిన్ తీసుకున్న 13కోట్ల మందిలో మీరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మీరు మన శాస్త్రవేత్తల గురించి కానీ, ప్రజలను వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రోత్సహించడం లేదు. దీన్నిబట్టి చూస్తే వ్యాక్సినేషన్పై మీరు రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అర్థమవుతోంది. వ్యాక్సిన్కు కాదు, మీకు పరిపక్వత లేదు’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బదులిచ్చారు. అంతకుముందు దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని పేర్కొంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్లో ఓ వీడియో పోస్టు చేశారు. జులై ముగిసినా.. వ్యాక్సిన్ కొరత మాత్రం తీరలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్లు ఎక్కడా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, రాహుల్ గాంధీ తీరుపై మండిపడ్డారు.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 47.02కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 60లక్షల డోసులను అందించినట్లు పేర్కొంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దేశంలో అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మెగా డ్రైవ్ ప్రారంభించిన జూన్ నెలలో దాదాపు 11కోట్ల డోసులను పంపిణీ చేయగా.. జులై నెలలో 13కోట్ల డోసులు పంపిణీ చేస్తామని ముందుగానే తెలిపింది. మొత్తానికి జులై చివరి నాటికి 51కోట్ల డోసులను అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయాలనే లక్ష్యాన్ని దాదాపుగా చేరుకున్నట్లేనని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం