Omicron: కొత్త వేరియంట్ను ప్రస్తుత టీకాలు ఎదుర్కొంటాయా..?
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలకు కొత్త వేరియంట్ రూపంలో సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి.
వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఏమంటున్నాయంటే..!
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలకు కొత్త వేరియంట్ రూపంలో సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఒమిక్రాన్ రూపంలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ యావత్ ప్రపంచాన్ని మరోసారి కలవరపెడుతోంది. అయితే, అంతకుముందు ప్రమాదకర వేరియంట్గా వ్యాప్తిలో ఉన్న డెల్టాను సైతం కొవిడ్ వ్యాక్సిన్లు సమర్థంగా ఎదుర్కొన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత వ్యాక్సిన్లు ఈ ఒమిక్రాన్ను వేరియంట్ను ఎదుర్కొంటాయా? లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంశంపై వివిధ వ్యాక్సిన్ తయారీ సంస్థలు స్పందన ఇలా ఉంది.
ప్రస్తుత టీకాలతో కష్టమే..: మోడెర్నా
విస్తృత వేగంతో వ్యాపించే ప్రమాదముందని భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ను ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు ఎదుర్కోవడం కష్టమేనని ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ ‘మోడెర్నా’ సీఈఓ ఫ్టీఫెన్ బన్సెల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను సంప్రదించిన శాస్త్రవేత్తలందరూ ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయినప్పటికీ వీటిపై మరో రెండు వారాల్లో పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని స్టీఫెన్ బన్సెల్ తెలిపారు.
టీకాలతో రక్షణే : ఆస్ట్రాజెనెకా
ఇక ఆస్ట్రాజెనెకా టీకా తయారు చేసిన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ కూడా ఒమిక్రాన్పై స్పందించింది. ఈ వేరియంట్ను టీకాలు సమర్థంగా ఎదుర్కోలేవని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. వీటికి సంబంధించి ఇప్పటివరకు స్వల్ప సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని.. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సమర్థతపై ఓ నిర్ధారణకు రాలేమని తెలిపింది. తమ వ్యాక్సిన్పై ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నామని.. అవసరమైతే ఈ వేరియంట్ను ఎదుర్కొనే విధంగా తమ టీకాను నవీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. గత ఏడాదికాలంగా చూసినట్లయితే.. కొత్తగా వెలుగు చూసే అన్ని వేరియంట్ల నుంచి వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తున్నాయనే విషయం మాత్రం స్పష్టమవుతోందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పేర్కొంది.
మరో రెండు వారాలు : సీరం సీఈఓ
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ ఆందోళనలు నెలకొన్న వేళ.. కొవిషీల్డ్ టీకా పనితీరుపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా స్పందించారు. ఈ వేరియంట్ను తమ వ్యాక్సిన్ (కొవిషీల్డ్) ఏ మేరకు ఎదుర్కొంటోందనే విషయం తెలుసుకునేందుకు మరో రెండు వారాలు పడుతుందని ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. సెకండ్ వేవ్ సమయంలో డెల్టా వేరియంట్పై ప్రభావంతంగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ఒమిక్రాన్పై ఆక్స్ఫర్డ్ నిపుణులు పరిశోధనలు ముమ్మరం చేశారని చెప్పుకొచ్చారు.
ఇలా ఒమిక్రాన్ వేరియంట్ను ప్రస్తుత వ్యాక్సిన్లు ఏమేరకు ఎదుర్కొంటాయే తెలుసుకునేందుకు వివిధ వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఇప్పటికే నిమగ్నమయ్యాయి. మోడెర్నా, ఆక్స్ఫర్డ్తో పాటు అమెరికా వ్యాక్సిన్ సంస్థ ఫైజర్, రష్యన్ వ్యాక్సిన్ సంస్థ స్పుత్నిక్లు కూడా ఒమిక్రాన్ వేరియంట్పై టీకాల ప్రభావాన్ని తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నామని వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434