India Corona: దేశంలో కొత్తగా 8,318 కేసులు..465 మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. తాజాగా 9,69,354 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,318 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది.
కర్ణాటక కళాశాలలో సూపర్ స్ప్రెడర్ ఘటన..281కి చేరిన కేసులు
దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. తాజాగా 9,69,354 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,318 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు 21 శాతం మేర తగ్గాయి. నిన్న 10,967 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరగా.. వారిలో 3.39 కోట్ల మంది వైరస్ను జయించారని శనివారం కేంద్రం వెల్లడించింది.
మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉండటంతో క్రియాశీల కేసులు లక్షకు చేరువయ్యాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1,07,019(0.31 శాతం)గా ఉంది. రికవరీ రేటు 98.34 శాతంగా కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 465 మరణాలు సంభవించాయి. అందులో 388 కేరళ నుంచి వచ్చినవే. ఇప్పటివరకు 4.67 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. మరోపక్క నిన్న 73లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 121 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.
కర్ణాటక కళాశాల 281కి పెరిగిన కేసులు: కర్ణాటకలోని ధార్వాడ్ వైద్య కళాశాల జరిగిన కళాశాల ఈవెంట్.. కరోనా సూపర్ స్ప్రెడర్గా మారిన సంగతి తెలిసిందే. దాంతో కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్తగా 99 మందికి పాజిటివ్గా తేలగా.. మొత్తం కేసులు 281కి చేరాయి. అందులో ఆరుగురిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ నితీశ్ పాటిల్ వెల్లడించారు. వైరస్ సోకినవారిలో చాలామంది రెండు డోసులు టీకా వేయించుకున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా.. డెల్టా నుంచి కాస్త ఉపశమనం పొందుతున్న ప్రపంచానికి ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో ముప్పు పొంచి ఉంది. దానిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు కోరుతున్నాయి. టీకా వేయించుకున్నా.. అజాగ్రత్త వద్దని హెచ్చరిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం