Delta Variant: చిన్నారులపై ‘డెల్టా వేరియంట్’ ప్రభావమెంత..?
చిన్నారులపై డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపిస్తుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి రుజువులు లేవని వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అమెరికా నిపుణులు ఏమంటున్నారంటే..
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ.. ఎక్కువ దేశాల్లో డెల్టా వేరియంట్ ప్రాబల్యమే అధికంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, అధిక సంక్రమణ కలిగిన ఈ వేరియంట్పై ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు సమర్థంగానే ఎదుర్కొంటున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులపై ఈ వేరియంట్ ప్రభావం ఏ విధంగా ఉందన్న అంశంపై ఆందోళన నెలకొంది. అయితే, చిన్నారులపై డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపిస్తుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి రుజువులు లేవని వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సంక్రమణ రేటు ఎక్కువగా ఉన్నందున పిల్లల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయని.. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే దాఖలాలు లేవని పేర్కొంటున్నారు.
డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా ముందు ఉందనే చెప్పవచ్చు. ముఖ్యంగా కొవిడ్ బారినపడుతున్న చిన్నారుల అక్కడ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత కొంతకాలంగా ప్రతివారం 2లక్షలకు పైగా చిన్నారులు పాజిటివ్గా తేలుతున్నట్లు అమెరికా అకాడెమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ వెల్లడించింది. వైరస్ బయటపడినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో మొత్తం 50లక్షల మంది చిన్నారులు వైరస్ బారినపడినట్లు పేర్కొంది. అయితే, వైరస్ బారినపడిన ప్రతి లక్ష మంది చిన్నారుల్లో కేవలం 2శాతం మందికి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోందని అమెరికా సీడీసీ వెల్లడించింది. ఇలా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిన వారిలో డెల్టా వేరియంట్ ప్రభావమే ఎక్కువగా కనిపించినప్పటికీ.. వారిలో ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నట్లు పేర్కొంది.
ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తున్నాయని అమెరికా సీడీసీ వెల్లడించింది. 12ఏళ్ల వయసు పైబడిన పిల్లల్లోనూ వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే.. తీసుకోని వారిలోనే ఆస్పత్రిలో చేరే ప్రమాదం 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అందుకే అత్యంత తేలికగా వ్యాప్తి చెందే సామర్థ్యం డెల్టా వేరియంట్కు ఉన్నందున స్కూళ్లలో మాస్కులు వాడకం, పెద్దవారికి టీకాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉందని ఫ్లోరిడాలోని జాన్స్ హాప్కిన్స్ ఆస్పత్రిలో పిల్లల విభాగాధిపతి డాక్టర్ జూవాన్ డుమోయిస్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434