Cyber attack: సైబర్‌ మోసాలపై ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థ: కేంద్రం

సైబర్‌ మోసాలపై ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. బాధితులు..

Published : 19 Aug 2021 19:41 IST

దిల్లీ: సైబర్‌ మోసాలపై ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేలా ప్రత్యేక ఆన్‌లైన్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌ నంబర్‌, సైబర్‌ సెల్‌, జీమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. బాధితులు సైబర్‌ మిత్ర హెల్ప్‌లైన్‌కూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్‌ 155260కి ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని