Rakesh Tikait: కనీస మద్దతు ధరపై చట్టం తేవాల్సిందే: టికాయిత్
పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా భరోసా కల్పిస్తూ చట్టం తీసుకురావాలని రైతు నేత రాకేశ్ టికాయిత్ మరోమారు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలకు శుక్రవారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా.....
దిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా భరోసా కల్పిస్తూ చట్టం తీసుకురావాలని రైతు నేత రాకేశ్ టికాయిత్ మరోమారు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలకు శుక్రవారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన కర్షకులకు నివాళులర్పించినట్లు పేర్కొన్న టికాయిత్.. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దిల్లీలోకి ప్రవేశించేందుకు మీకు అనుమతి లభించిందా? అని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు టికాయిత్. ‘మాకు అనుమతి ఎందుకు? ఇది చైనానా? లేక కొరియానా? వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ఎందుకు అనుమతి తీసుకోవాలి?’ అని స్పందించారు. కనీస మద్దతు ధరపై ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి త్వరలోనే రైతులతో చర్చిస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ 27న సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ, ఆందోళనలు, డిమాండ్లపై నిర్ణయం తీసుకోనున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చర్యలు చేపట్టి ఓ పరిష్కారాన్ని కనుగొన్న తర్వాతే ఆందోళనలు ముగిస్తామని పునరుద్ఘాటించారు.
సింఘూ సరిహద్దులో పండగ వాతావరణం
కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలకు శుక్రవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సింఘూ సరిహద్దులోని నిరసనల ప్రాంతానికి వందల ట్రాక్టర్లలో రైతులు తరలివచ్చారు. రంగు రంగుల విద్యుత్తు దీపాలు, డీజే బాక్సులతో ట్రాక్టర్లను ముస్తాబు చేసి సరిహద్దులకు చేరుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని కేంద్రం ప్రకటించటంపై హర్షం వ్యక్తం చేసిన రైతులు.. మిఠాయిలు పంచుకుని నృత్యాలు చేశారు. అన్నదాతల డ్యాన్సులు, ఆటపాటలతో సింఘూ సరిహద్దులో పండగ వాతావరణం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు