Talibans to UN: అంతర్జాతీయ వేదికపై.. మాకూ అవకాశం ఇవ్వండి..!
ఐక్యరాజ్య సమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో తమ ప్రతినిధి ప్రసంగించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ తాలిబన్ ప్రతినిధులు ఐరాస చీఫ్కు లేఖ రాశారు.
ఐరాస చీఫ్కు తాలిబన్ల విజ్ఞప్తి
న్యూయార్క్: అఫ్గానిస్థాన్ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం తాము సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పుకొంటున్న తాలిబన్లు.. అంతర్జాతీయ సమాజం గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం జరుగుతోన్న ఐక్యరాజ్య సమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో తమ ప్రతినిధి ప్రసంగించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఐరాస చీఫ్కు లేఖ రాశారు. ఈ లేఖ విషయాన్ని ఐరాస అధికార ప్రతినిధులు ధ్రువీకరించారు.
ప్రస్తుతం కొనసాగుతోన్న ఐరాస సర్వసభ్య సమావేశంలో తమ రాయబారి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని తాలిబన్ విదేశాంగశాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఐరాసలో తమ ప్రతినిధిగా సుహైల్ షహీన్ను నామినేట్ చేసిన విషయాన్ని అందులో పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే తాలిబన్లకు ముందున్న (అఫ్రాష్ ఘనీ) ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తోన్న గులాం ఇసాక్జాయ్ ఇంకా కొనసాగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం, అఫ్గానిస్థాన్ తరపున గులాం ఇసాక్జాయ్ ఈ సమావేశాల చివరి రోజున ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ఇకపై ఆయన తమ దేశానికి ప్రాతినిధ్యం వహించరని తాలిబన్లు స్పష్టం చేశారు.
తాలిబన్లు రాసిన లేఖను ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి ఫర్హాన్ హక్ ధ్రువీకరించారు. ఈ అభ్యర్థన లేఖను అమెరికా, చైనా, రష్యాతో పాటు మొత్తం తొమ్మిది సభ్యదేశాలతో కూడిన నిర్ధారణ కమిటీకి పంపించినట్లు వెల్లడించారు. అయితే, వచ్చే సోమవారంతో సమావేశాలు ముగుస్తున్నందున.. అంతకుముందే ఈ కమిటీ భేటీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తాలిబన్ల రాయబారి అంతర్జాతీయ వేదికపై ప్రసంగించడం అనుమానంగానే కనిపిస్తోంది.
అంతర్జాతీయ వేదికపై గుర్తింపు కోసం ఆరాటపడుతోన్న తాలిబన్లకు ఈ వేదికపై ప్రసంగించడం అత్యంత అవసరమనే చెప్పవచ్చు. ఇప్పటివరకు చైనా, పాకిస్థాన్ వంటి దేశాలు మినహా ప్రపంచ దేశాలు తాలిబన్ల ప్రభుత్వాన్ని బహిరంగంగా గుర్తించి వారితో సత్సంబంధాలు నెలకొల్పేందుకు ముందుకు రావడం లేదు. తాలిబన్లు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆయా దేశాలు ఆచితూచి స్పందించే ధోరణి అవలంభిస్తోన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు