వుహాన్లో స్నాతకోత్సవం: 11వేల మంది విద్యార్థులు హాజరు
ప్రపంచమంతా కరోనా రెండో దశ, మూడో దశ అంటూ భయాందోళనకు గురవుతుంటే చైనాలో మాత్రం తిరిగి సాధారణ పరిస్థితులు వచ్చేశాయి. ఒకవైపు అన్ని దేశాల్లో ప్రజలు మాస్క్లు, భౌతిక దూరం, గుంపులుగా ఉండకూడదంటూ కొవిడ్ నిబంధనలు పాటిస్తుంటే.. చైనాలో అవేవీ లేకుండా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. వైరస్ పుట్టుకకు కారణంగా
(Photo: Shakhwat Hossain facebook)
బీజింగ్: ప్రపంచమంతా కరోనా రెండో దశ, మూడో దశ అంటూ భయాందోళనకు గురవుతుంటే చైనాలో మాత్రం తిరిగి సాధారణ పరిస్థితులు వచ్చేశాయి. ఒకవైపు అన్ని దేశాల్లో ప్రజలు మాస్క్లు, భౌతిక దూరం, గుంపులుగా ఉండకూడదంటూ కొవిడ్ నిబంధనలు పాటిస్తుంటే.. చైనాలో అవేవీ లేకుండా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. వైరస్ పుట్టుకకు కారణంగా చెబుతున్న వైరాలజీ ల్యాబ్ ఉన్న వుహాన్లో తాజాగా నిర్వహించిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో 11 వేలమంది విద్యార్థులు పాల్గొన్నారు. అదీ మాస్క్లు లేకుండా.. పక్కపక్కనే కూర్చొని. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పది మంది కలిసి ఉన్న చోటకు వెళ్లలేని పరిస్థితులున్న ఈ రోజుల్లో వేలమంది విద్యార్థులతో వుహాన్లోని యూనివర్సిటీ వేడుక నిర్వహించడంతో అందరు ఆశ్చర్యానికి గురికావడంతోపాటు అలాంటి పరిస్థితులు మనకు ఎప్పుడు వస్తాయోనని అనుకుంటున్నారు.
2019లో చైనాలోని వుహాన్ తొలి కరోనా కేసు వెలుగుచూసింది. దీంతో నగరంలో లాక్డౌన్ విధించారు. కఠినమైన ఆంక్షలు అమలు చేసి కరోనాను నియంత్రించే ప్రయత్నం చేశారు. క్వారంటైన్, కరోనా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేశారు. విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించారు. ఇలా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో చైనాలో కరోనా కేసులు ఆదిలోనే తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత చైనా క్రమంగా లాక్డౌన్ను ఎత్తివేస్తూ.. నిబంధనలు సడలిస్తూ వచ్చారు. దేశీయంగా వ్యాక్సిన్ ఆవిష్కరించి ప్రజలకు వేగంగా వ్యాక్సిన్ ఇచ్చారు. అలా చైనా సాధారణ స్థితిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో వుహాన్ యూనివర్సిటీ గతేడాది డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులను, తాజాగా డిగ్రీపూర్తి చేసుకున్న విద్యార్థులను కలిపి స్నాతకోత్సవం నిర్వహించింది. ప్రస్తుతం చైనాలో రోజువారీ కరోనా కేసులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. మొత్తంగా 91,492 కేసులు నమోదుకాగా.. 86,369 మంది కోలుకున్నారు. 4,636 మంది కరోనాకు బలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434