ఇకపై అక్కడ టీవీలో జంక్ఫుడ్స్ యాడ్స్ నిషేధం
టెలివిజన్లో ప్రసారమయ్యే జంక్ ఫుడ్ ప్రకటనలపై బ్రిటన్ ప్రభుత్వ కఠిన చర్యలకు దిగనుంది.
పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కఠిన నిర్ణయం
లండన్: టెలివిజన్లో ప్రసారమయ్యే జంక్ ఫుడ్ ప్రకటనలపై బ్రిటన్ ప్రభుత్వ కఠిన చర్యలకు దిగనుంది. యువత ఊబకాయం బారిన పడుతున్న నేపథ్యంలో ప్రకటనలను నియంత్రించాలని నిర్ణయించింది. స్టేట్ ఫండెండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ అంచనా ప్రకారం.. నాలుగేళ్ల వయస్సులోపు పిల్లల్లో 10శాతం మంది ఊబకాయ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. అదే 10, 11 ఏళ్ల వయసు వారిలో 20.2 శాతానికి పెరిగిందని వెల్లడించింది. ప్రతీ నలుగురిలో ఒకరికి ఊబకాయం ఉన్నట్లుగా ఇందులో తేలడంతో అప్రమత్తమైన ఆ దేశం వెంటనే హైక్యాలరీ ఫుడ్స్ని నియంత్రించాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ముందుగా యాడ్స్ని నియంత్రించాలన్న కఠిన నిర్ణయాన్ని అమలు చేయనుంది.
ఇవే ఆ రూల్స్..
ఆరోగ్యశాఖ మంత్రి జో చర్చిల్ కొత్త పాలసీ విధానాన్ని వివరిస్తూ.. ‘‘వచ్చే ఏడాది చివరి నుంచి టీవీ ఛానళ్లలో తీపి, ఉప్పు..కొవ్వుశాతం అధికంగా ఆహార పదార్థాల యాడ్స్ను రాత్రి 9గంటల ముందు ప్రసారం చేయకూడదు. ఇది పూర్తిగా అనారోగ్యం నుంచి పిల్లలను కాపాడుకునేందుకే. తీపి, ఉప్పు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న 60శాతం యాడ్స్ టీవీలో ముఖ్యంగా సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 9గంటలకు ప్రసారం అవుతున్నాయి’’ అని వివరించారు.
ఆన్లైన్లో యాడ్స్ ఇవ్వొచ్చు...
ఈ కొత్త షరతులు కేవలం టీవీ వరకే వర్తిస్తాయని ఆన్లైన్లో ప్రమోషన్స్ చేసుకోవచ్చని స్పష్టతనిచ్చారు. ముఖ్యంగా జంక్ఫుడ్స్ ప్రమోషన్స్ చేసుకోవాలనుకుంటే వారి సోషల్మీడియా ఖాతాలతో పాటు బ్లాగ్స్లో ఇచ్చుకోవచ్చని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.