కరోనా టీకా తీసుకున్న ఐరాస సెక్రటరీ జనరల్‌

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ తొలి డోసు కొవిడ్‌-19 టీకాను తీసుకున్నారు.

Published : 29 Jan 2021 13:45 IST

న్యూయార్క్‌: ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ తొలి డోసు కొవిడ్‌-19 టీకాను నేడు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా కరోనా టీకాను తీసుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రభుత్వాలకు సూచించారు.

71 ఏళ్ల గుటెర్రస్‌, న్యూయార్క్‌ నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కరోనా టీకా వేయించుకున్నారు. అనంతరం చేతితో విజయ చిహ్నం చూపుతున్న ఓ వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ‘‘కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి సిబ్బంది, దౌత్యవేత్తలకు భాగం కల్పించినందుకు న్యూయార్క్‌ నగరానికి కృతజ్ఞతలు. కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధంలో పరస్పర సహకారం అతి కీలకం’’ అని వ్యాఖ్యానించారు.

కాగా, 65 ఏళ్లు పైబడిన తమ పౌరులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్ అందజేస్తున్నామని.. ఈ క్రమంలో ఐరాస సెక్రటరీ జనరల్‌కు కూడా టీకా ఇచ్చామని న్యూయార్క్‌ నగర మేయర్‌ కార్యాలయం ప్రకటించింది.

ఇవీ చదవండి..

మాస్క్‌పై మాస్క్‌.. ప్రయోజనమెక్కువ

భారత్‌ ప్రపంచానికే ఆస్తి.. ఐరాస


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని