‘అక్కడి హింసపై ప్రపంచ దేశాలు గొంతెత్తాలి’
మయన్మార్లో పౌర ప్రభుత్వాన్ని నెలకొల్పాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై సైన్యం సాగిస్తున్న హింసాకాండపై అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో బుధవారం చోటుచేసుకున్న హింసాత్మక సన్నివేశాలు తమను భయభ్రాంతులకు గురిచేశాయని పేర్కొంది.
వాషింగ్టన్: మయన్మార్లో పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ నిరసన చేస్తున్న వారిపై సైన్యం కాల్పులు జరపడాన్ని అగ్రరాజ్యం తప్పుబట్టింది. ఆ దేశంలో బుధవారం చోటుచేసుకున్న హింసాత్మక సన్నివేశాలు తమను ఆందోళనకు గురిచేశాయని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
‘మయన్మార్లో ప్రజలపై పెరుగుతున్న సైన్యం దాడులు, జర్నలిస్టుల అక్రమ అరెస్టులు ఆందోళన కలగజేస్తున్నాయి. సొంత ప్రజలపై బర్మా మిలిటరీ కొనసాగిస్తున్న హింసాత్మక విధానాన్ని ఖండించాల్సిందిగా మేం ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బుధవారం నాటి హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఫొటోలు, నివేదికలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. పౌర ప్రభుత్వం కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిపై హింసాకాండను చూసి మేం ఆందోళనకు గురయ్యాం. అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టులను సైన్యం వెంటనే విడుదల చేయాలి. జర్నలిస్టులను వేధించడం ఆపాలి. మయన్మార్ ప్రజల శాంతియుత నిరసనలకు మా మద్దతు ఉంటుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్, జపాన్ మాకు కీలక భాగస్వామ్య దేశాలు. కాబట్టి బర్మాలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు మేం సంయుక్తంగా కృషి చేస్తాం’ అని ప్రైస్ తెలిపారు.
మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు బుధవారం రక్తసిక్తమయ్యాయి. రహదారులపైకి వచ్చి నిరసనలు చేపట్టిన ప్రజలపై పోలీసులు తూటాల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో 38 మంది మరణించినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434