విమానం మెట్లపై జారిపడ్డ బైడెన్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(78) ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎక్కే క్రమంలో మెట్లపై జారిపడ్డారు. శ్వేతసౌధం నుంచి అట్లంటాకు బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది....

Published : 20 Mar 2021 16:42 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(78) ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎక్కే క్రమంలో మెట్లపై జారిపడ్డారు. శ్వేతసౌధం నుంచి అట్లంటాకు బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడిన తర్వాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం ఎక్కేందుకు వచ్చిన జో బైడెన్‌ మెట్లు ఎక్కే క్రమంలో వరుసగా మూడుసార్లు జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో భద్రతాసిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని