CoronaVaccine: పిల్లలకు ఎప్పుడు?
: రెండో దశలో కరోనా రక్కసి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి మీదా ప్రతాపం చూపిస్తోంది. వైరస్ ధాటికి ఇప్పటికే ఎంతోమంది ముక్కుపచ్చలారని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండో దశ ఉద్ధృతిలో పిల్లల్లో వైరస్ కేసులు
ఇంటర్నెట్డెస్క్: రెండో దశలో కరోనా రక్కసి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి మీదా ప్రతాపం చూపిస్తోంది. వైరస్ ధాటికి ఇప్పటికే ఎంతోమంది ముక్కుపచ్చలారని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండో దశ ఉద్ధృతిలో పిల్లల్లో వైరస్ కేసులు ఎక్కువవుతుండటంతో వ్యాక్సిన్ల కోసం తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రెండేళ్ల చిన్నారుల నుంచి 18ఏళ్ల యువతపై టీకా ప్రయోగాలకు అనుమతులు మంజూరు చేసింది. మరి పిల్లలకు వ్యాక్సిన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? వీరికి కూడా పెద్దవాళ్లలాగే ఇస్తారా? అవి వారికి సురక్షితమేనా?
ముమ్మరంగా ప్రయోగాలు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ కరోనా టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ 18ఏళ్ల పైబడిన వారికే. నిజానికి గతేడాది కరోనా విజృంభణ సమయంలో చిన్నారులపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంది. అయితే ఇప్పుడు అనేక రూపాంతరాలు చెందుతున్న ఈ మహమ్మారి పిల్లలపైనా విరుచుకుపడుతోంది. దీంతో చిన్నారులకు టీకాను విస్తరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే అనేక సంస్థలు ఆరు నెలల చిన్నారుల నుంచి 18ఏళ్ల లోపు వారిపై జరుపుతున్న క్లినికల్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయి.
రెండేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల లోపు వారిపై కొవాగ్జిన్ ప్రయోగాలకు భారత్ బయోటెక్కు అనుమతి లభించిన విషయం తెలిసిందే. భారత్ వెలుపల ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా లాంటి సంస్థలు కూడా పిల్లలపై టీకా ప్రయోగాలు చేస్తున్నాయి. 12-18 ఏళ్ల వారిపై మోడెర్నా టీకా ప్రయోగ ఫలితాలు త్వరలో రానున్నాయి. 2-11ఏళ్ల వారిపైనా ఈ సంస్థ క్లినికల్ ట్రయల్స్ చేయనుంది. ఇక ఫైజర్ సంస్థ 12ఏళ్ల పైబడిన వారి కోసం తయారు చేసి టీకాకు అమెరికా, కెనెడా ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. త్వరలోనే ఈ సంస్థ నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య చిన్నారులపై కూడా పరీక్షలు జరపనుంది. వీటితో పాటు జాన్సన్ అండ్ జాన్సన్, నొవావాక్స్ కూడా పిల్లలపై ప్రయోగాలు వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నాయి.
ఆ దేశాల్లో 12ఏళ్ల పైబడిన వారికి టీకా..
అమెరికాలో 12-15 ఏళ్ల వయసు వారికి ఫైజర్ టీకాలు ఇచ్చేందుకు ఆ దేశ ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ(ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది. అంతకుముందే 16-18ఏళ్ల వారికి టీకా అందించేందుకు అమెరికా అనుమతించింది. తాజాగా 12-15 మధ్య వయసు వారిలోనూ ఫైజర్ టీకా సమర్థంగా పనిచేస్తుందని క్లినికల్ పరీక్షల ద్వారా నిర్ధారణ అవడంతో ఎఫ్డీఏ అనుమతులు మంజూరు చేసింది. మరోవైపు కెనడా ప్రభుత్వం కూడా 12ఏళ్లు దాటిన పిల్లలకు టీకా ఇచ్చేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ దేశంలో 12-18ఏళ్ల వయసు వారిపై ఫైజర్ జరిపిన ప్రయోగాలు ఫలించడంతో కెనెడా ప్రభుత్వం అనుమతులిచ్చింది.
పిల్లలకు భద్రమేనా?
నిజానికి చాలా మంది పిల్లలకు కరోనా సోకినా వారిలో లక్షణాలు కన్పించట్లేదు. లేదా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. సాధారణ జ్వరం లాగే కన్పించి తగ్గుతుంది. అయితే కొందరిలో మాత్రం ఎక్కువగా ఉంటోంది. దీంతో వీరికి టీకాలు అవసరమా లేదా అన్నదానిపై అనేక అపోహలు తలెత్తుతున్నాయి. మరోవైపు టీకాలతో దుష్ప్రభావాలు వస్తాయన్న ప్రచారం కూడా ఉండటంతో తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అయితే లక్షణాలు కన్పించకపోవడంతో పిల్లల నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించకుండా ఉండటం కోసం వారికి టీకా ఇవ్వాల్సిన అవసరం ఉందని కొందరు వైద్యులు చెబుతున్నారు.
12-15ఏళ్ల వయసు వారిపై ఫైజర్ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ యువొన్నె మాల్డొనాడో చెబుతున్నారు. అయితే పెద్దవాళ్లలాగే పిల్లలకు కూడా టీకా తీసుకున్న తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం సాధారణమే అని ఎఫ్డీఏ తెలిపింది. టీకా ఇచ్చిన చోట నొప్పి, దురదతో పాటు తలనొప్పి, జ్వరం, కీళ్లనొప్పులు వచ్చే అవకాశముందని, అయితే అవి త్వరగానే నయమవుతాయని పేర్కొంది. అయితే టీకా భద్రతపై నిపుణులు, ప్రభుత్వ సంస్థల నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ఎలా ఇస్తారు..?
ప్రస్తుతం భారత్ బయోటెక్ పిల్లలపై ప్రయోగిస్తున్న వ్యాక్సిన్ ఇంజెక్షన్ ద్వారా వేసే టీకా. తొలి డోసు వేసిన 28 రోజులకు రెండో డోసు వేయాల్సి ఉంటుంది. అయితే ముక్కు ద్వారా వేసే చుక్కల వ్యాక్సిన్పైనా కొన్ని సంస్థలు ప్రయోగాలు జరుపుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు