ప్రధాని సమాధానం చెప్పాలి: చిదంబరం

కరోనా కట్టడిలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత..

Published : 05 Sep 2020 20:37 IST

ఈనెల చివరినాటికి 65 లక్షల కేసులు నమోదవుతాయని వెల్లడి

దిల్లీ: కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈనెల చివరినాటికి దేశంలో కరోనా కేసులు 65 లక్షలకు చేరుకుంటాయని అంచనా వేశారు. ‘సెప్టెంబర్‌ 30 నాటికి 55 లక్షల కరోనా కేసులు నమోదవుతాయని మొదట అంచనా వేశాను. కానీ అది తప్పు. సెప్టెంబర్‌ 20 నాటికే ఆ సంఖ్యకు చేరుకుంటాం. నెలాఖరు వరకు దాదాపు 65 లక్షల కేసులు నమోదవుతాయి’ అని చిదంబరం వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ‘21 రోజుల్లో కరోనాను అంతం చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ, వైరస్‌ కట్టడిలో ఇతర దేశాలు విజయం సాధిస్తుంటే మీరెందుకు విఫలమయ్యారో వెల్లడించాలి ’ అని డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌తో ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారు. 

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పైనా విమర్శలు సంధించారు. 2020-21 జీడీపీ పతనమవ్వడానికి కారణాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు వెల్లడించలేదన్నారు. ‘వీ’ ఆకారపు రికవరీ ఉంటుందని ఎప్పటిలాగే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చిదంబరం ఆరోపించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని