Corona: మరణ మృదంగ‘మే’
4077, 4106, 4329, 4,529.. గత నాలుగు రోజులుగా దేశంలో నమోదైన కరోనా మరణాలివి. గత కొద్ది రోజులుగా దేశంలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. వైరస్తో ప్రాణాలు
18 రోజులు.. 71,395 మరణాలు
ఇంటర్నెట్డెస్క్: 4077, 4106, 4329, 4,529.. గత నాలుగు రోజులుగా దేశంలో నమోదైన కరోనా మరణాలివి. గత కొద్ది రోజులుగా దేశంలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. వైరస్తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుండం భయాందోళనలు రేపుతోంది. ఈ మృత్యుఘోష ఆగేదెప్పుడా అని యావత్ భారతావని ఆశగా ఎదురుచూస్తోంది. మరి కొత్త కేసులు, రికవరీలు ఊరటనిస్తున్నప్పటికీ.. మరణాలు ఎందుకు ఇంత భారీగా ఉంటున్నాయంటే.. దీనికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
మే నెలలో భారీగా మరణాలు..
గత కొద్ది రోజులుగా మరణాల సంఖ్య 4వేల పైనే ఉంటోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మే నెల ఆరంభం నుంచి ఇప్పటివరకూ 71,395 మందిని మహమ్మారి బలితీసుకుంది. అంటే సగటున రోజుకు 3800 మందికి పైనే వైరస్తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఏప్రిల్ నెల మొత్తంలో 49వేలుగా ఉన్న మరణాల సంఖ్య ఈ నెలలో రెట్టింపు అయ్యేలాగే కన్పిస్తోంది. తాజాగా నిన్న ఒక్క రోజే 4,529 మంది మరణించగా.. దేశంలో మొత్తం మరణాలు 2.8లక్షలు దాటాయి.
ఏప్రిల్ ఉద్ధృతి ప్రభావమేనా..
రెండో దశలో కరోనా అలుపన్నదే లేకుండా పేట్రేగిపోయింది. పల్లెలు.. పట్టణాలు అనే తేడా లేకుండా, చిన్నా పెద్దా అని చూడకుండా అందరిమీదా గట్టిగా విరుచుకుపడింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే దాదాపు 70లక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంటే సగటున రోజుకు 2లక్షలకు పైనే కేసులు వచ్చాయి. ఆ ఉద్ధృతే రికార్డు స్థాయి మరణాలకు దారితీస్తోందనేది నిపుణుల మాట. అయితే దీంతో పాటు కొన్ని రాష్ట్రాలు పాత మరణాలను కూడా ఇప్పుడు వెల్లడించడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. మహారాష్ట్రలో సోమవారం 1200 మరణాలు నమోదు కాగా.. ఇందులో క్రితం వారం నాటి మరణాలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక కర్ణాటకలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. మరణాల నమోదులో అధికారుల అలసత్వం కారణంగానే ఇలా జరుగుతోంది.
జూన్ నాటికి తగ్గే అవకాశం..
గత నెలలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో ఉండటంతో ఇప్పుడు మరణాలు భారీగా ఉంటున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే నెలలో ఈ సంఖ్య తగ్గే అవకాశాలున్నట్లు కన్పిస్తోంది. ప్రస్తుతం కొత్త కేసులు కూడా తగ్గుతుండటంతో రికార్డు మరణాలకు అడ్డుకట్టపడేలాగే ఉంది. కరోనా కేసుల ప్రభావం మూడు వారాల తర్వాత మృతుల సంఖ్యపై కన్పిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆ ఐదు రాష్ట్రాల్లో మరణమృదంగం
కరోనా దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 2.8లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 83,777 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కర్ణాటకలో 22,838 మంది, దిల్లీలో 22వేల మంది మరణించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడులోనూ మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో రోజుకు సగటున 300 మందికి పైనే వైరస్కు బలవుతున్నారు. 12 రాష్ట్రాల్లో రోజువారీ మరణాల సంఖ్య 100 కంటే ఎక్కువగానే ఉంటుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434