Chandrayaan 3: చంద్రుడిని చేరాలంటే.. 40 రోజులు ఎందుకు పడుతోంది..?
చంద్రుడిపై చేసే ప్రయోగాల కోసం అక్కడకు రోవర్లను పంపించాలంటే అమెరికా చేపట్టిన ‘అపోలో 11’కి నాలుగు రోజులు, రష్యాకు ఒకటిన్నర రోజు పడితే.. భారత్కు 40రోజులు పడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలు ఎంతో ప్రగతి సాధించినా.. చంద్రుడి అన్వేషణ ఓ సవాలుగానే మారింది. దశాబ్దాల క్రితమే జాబిల్లిపై అమెరికా కాలుమోపగా.. తర్వాత రష్యా, చైనాలు తమ రోవర్లను అక్కడ సురక్షితంగా దించగలిగాయి. భారత్ సైతం.. ఇదే ప్రయత్నంలో భాగంగా చంద్రయాన్-3ని ప్రయోగించింది. ఇస్రో రాకెట్ ఇప్పటికే దీన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టినా.. చంద్రుడిని చేరాలంటే మాత్రం 40రోజులకుపైగా సమయం తీసుకుంటుంది. అదే అమెరికా గతంలో చేపట్టిన ‘అపోలో 11’ మాత్రం నాలుగు రోజుల్లోనే అక్కడికి చేరుకుంది. రష్యాకు ఒకటిన్నర రోజులే పట్టింది. మరి ఇస్రోకు నెలకు పైగా సమయం ఎందుకనే విషయాన్ని పరిశీలిస్తే..
భూమి నుంచి 3.84 లక్షల కి.మీ దూరంలో ఉన్న చంద్రుడి వద్దకు నేరుగా వెళ్తే.. స్వల్ప వ్యవధిలోనే చేరుకోవచ్చు. అయితే, అందుకు శక్తిమంతమైన రాకెట్ను వినియోగించాల్సి ఉంటుంది. పైగా.. భారీ మొత్తంలో ఇంధనం అవసరం. ఇందుకోసం భారీ రాకెట్ను వినియోగించాల్సి ఉంటుంది. 1969 జులై 16న అమెరికా చంద్రుడిపైకి ‘అపోలో 11’ ప్రయోగానికి భారీ రాకెట్ను వినియోగించింది. అపోలోను మోసుకెళ్లిన శాటర్న్ వీ రాకెట్ ఎత్తు 363 అడుగులు కావడం గమనార్హం. ప్రస్తుతం ఇస్రో వినియోగించిన ఎల్వీఎం-3 రాకెట్ ఎత్తు 142 అడుగులు మాత్రమే.
భారీ రాకెట్ల ప్రయోగం.. అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. భారీ ప్రయోగాల కోసం అమెరికా శాటర్న్ వీ రాకెట్లను 1967 నుంచి 1973 వరకు పలుసార్లు వినియోగించింది. చంద్రుడిపైకి మానవులను పంపించేందుకు కూడా ఇదే రాకెట్ను ఉపయోగించింది. అది గంటకు 39వేల కి.మీ వేగంతో ప్రయాణించగలదు. అంతేకాకుండా అత్యంత శక్తిమంతమైన రాకెట్లు.. తాము మోసుకెళ్లే పేలోడ్నూ వేగంగా చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టగలవు. అలా ‘అపోలో 11’ రాకెట్.. నాలుగు రోజుల్లో చంద్రుడి వద్దకు చేరుకుంది. అంతకుముందు వెళ్లిన అపోలో- 8 కేవలం 69 గంటల్లోనే ఈ పని పూర్తి చేసింది. ఇక 1959లో రష్యా చేపట్టిన లూనా-2 వ్యోమనౌక కేవలం 34 గంటల్లో చంద్రుడిని చేరింది. అయితే, 1964-73 మధ్యకాలంలో అమెరికా తన ఒక్కో ప్రాజెక్టుకు సుమారు 185 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ.. ఇస్రో మాత్రం కేవలం రూ.615 కోట్లతోనే చంద్రయాన్- 3 ప్రాజెక్టుకు చేపట్టింది.
వేగంగా వెళ్లాల్సిన అవసరం లేకపోవడం, ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇస్రో.. భిన్న మార్గాన్ని ఎంచుకొంది. భూమి గురుత్వాకర్షణ సాయంతో చంద్రుడివైపు పయనించే విధానాన్ని అనుసరిస్తోంది. ఈ క్రమంలో తొలుత చంద్రయాన్-3ని రాకెట్ ద్వారా భూమి చుట్టూ ఉన్న 170X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడుతోంది. భూమి చుట్టూ 24 రోజులపాటు చక్కర్లు కొడుతూనే చంద్రయాన్-3.. క్రమంగా తన కక్ష్యను పెంచుకుంటూపోతుంది. అలా చివరకు చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి చేరుకుంటుంది. ఈ ప్రక్రియకు దాదాపు 40రోజుల సమయం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్పై జరిగిన భౌతిక దాడి సిగ్గుచేటని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. -
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ
ఆ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖలో టెండర్ దక్కాలంటే మంత్రిగారికి 1.5శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనంట. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ ఈడీ కోర్టుకు వెల్లడించింది. -
మోదీపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థం లేనివి: రాజ్నాథ్ సింగ్
ప్రధాని మోదీపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. -
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నా ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనాకు తగ్గి.. భారత్కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస
-
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
-
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్