Delhi Corona: దేశ రాజధానిలో మృత్యుఘోష!
Corona Deaths Spike in Delhi: దిల్లీలో నిన్న ఒక్కరోజే 380 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు...
రికార్డు స్థాయిలో రోజువారీ మరణాలు
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ధాటికి దేశ రాజధాని దిల్లీ వణికిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొవిడ్ (Covid) మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే అక్కడ అత్యధికంగా 380 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఒకేరోజు వ్యవధిలో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారని దిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో దిల్లీలో కొవిడ్ మృతుల అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటికలు సరిపోవడం లేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
5 రోజులుగా రికార్డుస్థాయిలో మరణాలు..
దిల్లీలో కరోనా (Corona) మరణాల సంఖ్య కలవరపెడుతోంది. గడిచిన ఐదు రోజులుగా అక్కడ నిత్యం 300లకు పైగా కొవిడ్ మరణాలు రికార్డవుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 380మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు (ఆదివారం) 350 మంది చనిపోగా, శనివారం 357 మంది మృత్యువాతపడ్డారు. ఇలా ఇప్పటివరకు దిల్లీలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 14,628కి చేరింది.
అంత్యక్రియలకు కటకట..
రోజురోజుకి కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతుండటంతో దిల్లీలోని శ్మశాన వాటికలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతమున్నవి సరిపోక.. వాటికి పక్కనే ఉండే పార్కులు, పార్కింగ్ స్థలాలు, రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలాల్లోనూ చితులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి శ్మశాన వాటికలోనూ అన్ని చితులూ నిరంతరం కాలుతుండడంతో అంత్యక్రియల కోసం శవాలతో బంధువులు నిరీక్షిస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీలున్నచోట కొత్తగా చితిమంటల వేదికలు నిర్మిస్తున్నారు.
35శాతం దాటిన పాజిటివిటీ రేటు..
దిల్లీలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ కరోనా ఉద్ధృతి అదుపులోకి రావడం లేదు. నిత్యం 20వేలకు పైగా కొత్తగా పాజిటివ్ (Corona Positivity) కేసులు వెలుగు చూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 20,201 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ బారినపడిన వారిసంఖ్య 10లక్షల 47వేలకు చేరింది. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 35.02శాతానికి చేరింది. గడిచిన ఐదు రోజుల నుంచి అక్కడ నిత్యం పాజిటివిటీ రేటు 30శాతానికి పైగా ఉంటోంది. ప్రస్తుతం నగరంలో 92,358క్రియాశీల కేసులు ఉన్నాయి.
ఆక్సిజన్ కొరత..దిల్లీ హైకోర్టు ఆగ్రహం
కొవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ.. దిల్లీలోని ఆసుపత్రులు తీవ్ర ఆక్సిజన్ కొరత (Oxygen Shortage) ను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లను నల్లబజారులో (Black market)లో అమ్ముతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై దిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని తమ ముందుకు తీసుకురావాలని దిల్లీ ప్రభుత్వానికి సూచించింది. దిల్లీలో నెలకొన్న ఆక్సిజన్ సంక్షోభంపై జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖా పల్లీలతో కూడిన ధర్మాసనం సోమవారం నాడు దాదాపు మూడున్నర గంటలపాటు విచారణ జరిపింది. మంగళవారం కూడా దీనిపై విచారణ జరుపుతామన్న ధర్మాసనం.. ఆక్సిజన్ రీఫిల్లర్లను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 3లక్షల 23వేల కేసులు బయటపడ్డాయి. మరో 2771 మంది కొవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో భారత్లో కరోనా మరణాల సంఖ్య 1,97,894కు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం