Delhi Corona: దేశ రాజధానిలో మృత్యుఘోష!
Corona Deaths Spike in Delhi: దిల్లీలో నిన్న ఒక్కరోజే 380 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు...
రికార్డు స్థాయిలో రోజువారీ మరణాలు
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ధాటికి దేశ రాజధాని దిల్లీ వణికిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొవిడ్ (Covid) మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే అక్కడ అత్యధికంగా 380 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఒకేరోజు వ్యవధిలో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారని దిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో దిల్లీలో కొవిడ్ మృతుల అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటికలు సరిపోవడం లేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
5 రోజులుగా రికార్డుస్థాయిలో మరణాలు..
దిల్లీలో కరోనా (Corona) మరణాల సంఖ్య కలవరపెడుతోంది. గడిచిన ఐదు రోజులుగా అక్కడ నిత్యం 300లకు పైగా కొవిడ్ మరణాలు రికార్డవుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 380మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు (ఆదివారం) 350 మంది చనిపోగా, శనివారం 357 మంది మృత్యువాతపడ్డారు. ఇలా ఇప్పటివరకు దిల్లీలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 14,628కి చేరింది.
అంత్యక్రియలకు కటకట..
రోజురోజుకి కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతుండటంతో దిల్లీలోని శ్మశాన వాటికలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతమున్నవి సరిపోక.. వాటికి పక్కనే ఉండే పార్కులు, పార్కింగ్ స్థలాలు, రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలాల్లోనూ చితులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి శ్మశాన వాటికలోనూ అన్ని చితులూ నిరంతరం కాలుతుండడంతో అంత్యక్రియల కోసం శవాలతో బంధువులు నిరీక్షిస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీలున్నచోట కొత్తగా చితిమంటల వేదికలు నిర్మిస్తున్నారు.
35శాతం దాటిన పాజిటివిటీ రేటు..
దిల్లీలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ కరోనా ఉద్ధృతి అదుపులోకి రావడం లేదు. నిత్యం 20వేలకు పైగా కొత్తగా పాజిటివ్ (Corona Positivity) కేసులు వెలుగు చూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 20,201 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ బారినపడిన వారిసంఖ్య 10లక్షల 47వేలకు చేరింది. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 35.02శాతానికి చేరింది. గడిచిన ఐదు రోజుల నుంచి అక్కడ నిత్యం పాజిటివిటీ రేటు 30శాతానికి పైగా ఉంటోంది. ప్రస్తుతం నగరంలో 92,358క్రియాశీల కేసులు ఉన్నాయి.
ఆక్సిజన్ కొరత..దిల్లీ హైకోర్టు ఆగ్రహం
కొవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ.. దిల్లీలోని ఆసుపత్రులు తీవ్ర ఆక్సిజన్ కొరత (Oxygen Shortage) ను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లను నల్లబజారులో (Black market)లో అమ్ముతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై దిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని తమ ముందుకు తీసుకురావాలని దిల్లీ ప్రభుత్వానికి సూచించింది. దిల్లీలో నెలకొన్న ఆక్సిజన్ సంక్షోభంపై జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖా పల్లీలతో కూడిన ధర్మాసనం సోమవారం నాడు దాదాపు మూడున్నర గంటలపాటు విచారణ జరిపింది. మంగళవారం కూడా దీనిపై విచారణ జరుపుతామన్న ధర్మాసనం.. ఆక్సిజన్ రీఫిల్లర్లను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 3లక్షల 23వేల కేసులు బయటపడ్డాయి. మరో 2771 మంది కొవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో భారత్లో కరోనా మరణాల సంఖ్య 1,97,894కు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. మహారాజ్గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. -
దుస్తుల్లేని చిన్ననాటి ఫొటోపై అభ్యంతరం.. అకౌంట్ను నిలిపివేసిన గూగుల్
చిన్నప్పటి ఫొటోను డ్రైవ్లోకి అప్లోడ్ చేసిన వ్యక్తికి గూగుల్ షాకిచ్చింది. అతడి అకౌంట్ను నిలిపివేసింది. దీనిపై ఏడాదిగా గూగుల్తో పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. -
ఎన్నికల బాండ్ల సమాచారమంతా వెల్లడించాల్సిందే
ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణిని బ్యాంక్ విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది. -
పశ్చిమ బెంగాల్ డీజీపీపై వేటు
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీతోపాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తప్పించింది. వారితోపాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. -
ఆజం ఖాన్కు ఏడేళ్ల జైలుశిక్ష
ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్కు స్థానిక కోర్డు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. 2016లో దుంగార్పుర్లో ఒక ఇంటిని బలవంతంగా కూల్చివేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. -
‘సామాజిక’ ప్రచారం
ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియకు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా వాట్సప్, సామాజిక మాధ్యమాలు, ఇన్ఫ్లుయెన్సర్లకు గిరాకీ పెరిగింది. -
వేడెక్కుతున్న ఉత్తర భారతం
ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోందని అమెరికన్ శాస్త్రజ్ఞుల బృందం క్లైమేట్ సెంట్రల్ హెచ్చరించింది. ఈ బృందం 1970 నుంచి డిసెంబరు-ఫిబ్రవరి కాలంలో ఉత్తర భారత్లో ఉష్ణోగ్రతల తీరుతెన్నులను విశ్లేషించింది. -
స్నేహమంటే అదే కదా.. నేవీ ఆపరేషన్పై జై శంకర్ స్పందన
సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం కాపాడిన విషయం తెలిసిందే. దాంతో మన రక్షణ సిబ్బంది చేసిన ఆపరేషన్పై బల్గేరియా నుంచి కృతజ్ఞతలు వ్యక్తమయ్యాయి. -
మమ్మల్ని దర్యాప్తు సంస్థలా మార్చకండి
గుజరాత్ యూనివర్సిటీలో గత వారాంతంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడిని సుమోటోగా స్వీకరించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం తిరస్కరించింది. -
పోలీసు కాల్పుల్లో ఉపాధ్యాయుడి మృతి
ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్లో చిన్నపాటి ఘర్షణ కారణంగా హెడ్ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ రెబల్స్కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట
కాంగ్రెస్ పార్టీ విప్ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి అనర్హులైన ఆరుగురు రెబల్స్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించలేదు. -
వివక్షతో ఉద్యోగాలు నిరాకరించొద్దు
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ట్రాన్స్జెండర్లపై వివక్ష ఉండకూడదని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. -
వ్యక్తిగత హోదాలోనే విరాళాలిచ్చాను
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్.. ఏ పార్టీకీ ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలివ్వలేదని ఆ సంస్థ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా సోమవారం వెల్లడించారు. -
ఈడీ సమన్లను లెక్కచేయని కేజ్రీవాల్
నగదు అక్రమ చలామణి కేసులో ప్రశ్నలకు జవాబివ్వడానికి సోమవారం రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెక్కచేయలేదు. -
సాంక్రమికేతర వ్యాధులను పెంచుతున్న ఆహారపుటలవాట్లు
భారతీయుల ఆహారంలో మితిమీరిన ఉప్పు వినియోగం, సరిపడా పొటాషియం లేకపోవడం వంటి ఆందోళనకర పోకడలు పెరుగుతున్నాయని తాజా పరిశోధన తేల్చింది. -
భారత నౌకాదళం భేష్: అమెరికా రక్షణ మంత్రి ప్రశంస
హిందూ మహాసాగరంలో సముద్రపు దొంగల ఆటకట్టించే ఆపరేషన్ల నిర్వహణలో భారత నౌకాదళ పాత్రను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కొనియాడారు. శుక్రవారం భారత నౌకాదళం నడి సముద్రంలో సాహసోపేత ఆపరేషన్ నిర్వహించి.. -
సంక్షిప్త వార్తలు (5)
కబేళాలు, మాంసం ప్రాసెసింగ్ యూనిట్లను ‘పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)-2006’ పరిధిలోకి చేర్చాల్సిన అవసరం లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. -
Indian Navy: కొచ్చిలో కుప్పకూలిన నిఘా ఎయిర్క్రాఫ్ట్
భారత నేవీకి చెందిన రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్క్రాఫ్ట్ (RPA) కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడ బేస్ వద్ద కూలిపోయింది. -
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం
బెంగళూరులో రోజుకు 2600 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉండగా.. దాదాపు 500 ఎంఎల్డీ కొరత ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. -
Kolkata: భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు
కోల్కతాలో భవనం కుప్పకూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. 17 మందికి గాయాలు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
UP: వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది