దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్‌

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. సెలబ్రిటీలు సైతం దీని బారిన పడుతున్నారు. ఇటీవల అగ్ర దర్శకుడు

Published : 03 Aug 2020 16:45 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. సెలబ్రిటీలు సైతం దీని బారిన పడుతున్నారు. ఇటీవల అగ్ర దర్శకుడు రాజమౌళి కుటుంబం కరోనా బారిన పడినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. కాగా, ఇప్పుడు మరో దర్శకుడు తేజకు కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇటీవల ముంబయి వెళ్లి వచ్చిన ఆయన ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా, కరోనా సోకినట్లు గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

తేజ ఇప్పటికే తన తర్వాతి చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నారు. గోపీచంద్‌, రానాలతో వేర్వేరుగా సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్‌లు చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని