కంగనపై దావా కేసు.. కోర్టుకు జావేద్‌ అక్తర్‌ 

బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌పై పరువు నష్టం దావా వేసిన ప్రముఖ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ కోర్టుకు హాజరయ్యారు. దావాకు సంబంధించి కేసు వేసిన వ్యక్తి కోర్టులో హాజరై వాదనలు వినిపించాలన్న నిబంధన మేరకు ఆయన గురువారం అంథేరీ న్యాయస్థానానికి వెళ్లారు. దావాకు సంబంధించిన

Published : 03 Dec 2020 19:54 IST

ముంబయి : బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌పై పరువు నష్టం దావా వేసిన ప్రముఖ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ కోర్టుకు హాజరయ్యారు. దావాకు సంబంధించి కేసు వేసిన వ్యక్తి కోర్టులో హాజరై వాదనలు వినిపించాలన్న ఆదేశాల మేరకు ఆయన గురువారం అంథేరీ న్యాయస్థానానికి వెళ్లారు. దావాకు సంబంధించిన పరిశీలన పూర్తి అయిందన్న న్యాయస్థానం తదుపరి వాదనలను డిసెంబరు 19 విననున్నట్లు తెలిపింది. తన పరువుకు భంగం కలిగేలా కంగన పలు మీడియా ఛానళ్లలో వ్యాఖ్యలు చేసినట్టు జావేద్‌ అక్తర్‌ గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ డెత్‌ మిస్టరీకి సంబంధించి న్యాయం జరగాలని కంగనా ట్విటర్‌ వేదికగా పలుమార్లు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఆమె పలు ఛానళ్లలో దీనిపై మాట్లాడారు. ఈ సందర్భంగా కంగన తన పేరును సుశాంత్‌ కేసులోకి అన్యాయంగా లాగినట్లు ఆయన తెలిపారు. తనపై కంగన వ్యాఖ్యలు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని జావేద్‌ అక్తర్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్‌ 14న తన నివాసంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిచెందిన విషయం తెలిసిందే. హీరో డెత్‌ మిస్టరీపై సీబీఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని