భయపెట్టడానికి సిద్ధమైన కాజల్‌..!

కథానాయిక కాజల్‌ పెళ్లి తర్వాత తొలి ప్రాజెక్టుకు సంతకం చేశారు. నెల రోజుల క్రితం తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లును ముంబయిలో మనువాడిన ఆమె తిరిగి షూటింగ్‌ పనుల్లో పడ్డారు. భర్తతోపాటు చెన్నై చేరుకుని, దర్శకుడు డీకేను కలిశారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న....

Published : 01 Dec 2020 17:09 IST

సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌

చెన్నై: కథానాయిక కాజల్‌ పెళ్లి తర్వాత తొలి ప్రాజెక్టుకు సంతకం చేశారు. నెల రోజుల క్రితం తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లును ముంబయిలో మనువాడిన ఆమె తిరిగి షూటింగ్‌ పనుల్లో పడ్డారు. భర్తతోపాటు చెన్నై చేరుకుని, దర్శకుడు డీకేను కలిశారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న ఓ హారర్‌ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కాజల్‌ దంపతులతో కలిసి తీసుకున్న ఫొటోను డీకే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. సినిమా ఖరారైందని, కాజల్‌-గౌతమ్‌తో సంభాషణ ఎంతో సరదాగా అనిపించిందని పేర్కొన్నారు.

చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో కాజల్‌కు డీకే కథ నరేట్‌ చేశారట. ఈ సినిమాలో నలుగురు కథానాయికలకు చోటున్నట్లు తెలుస్తోంది. కాజల్‌ పాత్రకు సంబంధించిన ఫొటోషూట్‌ కూడా పూర్తయినట్లు సమాచారం. త్వరలో పూర్తి వివరాలతో నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రానుంది. తమిళ నటుడు జీవా, కాజల్‌ జంటగా నటించిన ‘కవలై వెండం’ (‘ఎంతవరకు.. ఈ ప్రేమ’)కు డీకే దర్శకత్వం వహించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్‌లో మంచి టాక్‌ అందుకుంది. కాజల్‌ చేతిలో ప్రస్తుతం ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సగ’, ‘భారతీయుడు 2’ చిత్రాలున్నాయి. ఇవన్నీ వివిధ దశల్లో ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్నాయి. ఆమె త్వరలో ‘ఆచార్య’ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని