చనిపొమ్మంటూ ఫోన్కాల్స్ వచ్చాయి
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న తరుణంలో లండన్ నుంచి భారత్కు వచ్చి ప్రమాదవశాత్తు కొవిడ్-19 బారినపడి ప్రతిఒక్కర్నీ షాక్కు గురి చేసిన బాలీవుడ్ గాయని కనికాకపూర్. వృత్తిపరమైన పనులరీత్యా మార్చి నెలలో ముంబయికి చేరుకున్న కనికా...
కరోనాతో పోరాటం చేసి కోలుకున్న సెలబ్రిటీ కనికా కపూర్
ముంబయి: కరోనాతో పోరాటం చేసి కోలుకుని ప్రస్తుతం జీవితంలో ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు బాలీవుడ్ గాయని కనికాకపూర్. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె వైరస్ బారినపడినప్పుడు తాను, తన కుటుంబసభ్యులు ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు.
‘లండన్ నుంచి ముంబయికు చేరుకున్న సమయంలో స్వీయ నిర్బంధంలో ఉండాలని ఎవరూ చెప్పలేదు. ఇక్కడికి వచ్చాక రెండు పార్టీల్లో పాల్గొన్నాను. లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నాకెంతో భయమేసింది. అంత భయంలోనూ నాకు పాజిటివ్ అనే విషయాన్ని ఈ ప్రపంచానికి చెప్పకుండా దాచిపెట్టలేదు. నాతో పార్టీల్లో పాల్గొన్న 300 మందికి, నా స్టాఫ్కు టెస్టులు చేశారు. ఎవరికీ కరోనా రాలేదు. అలా నేను 16 రోజులపాటు ఒంటరిగా ఆస్పత్రిలో ఉన్నాను’
‘నాకు కరోనా వచ్చిన సమయంలో నా కుటుంబం, పిల్లలు ఎంతో బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా నా పిల్లల్ని లండన్లో వదిలి ఇండియాకు రావాల్సి వచ్చింది. వాళ్లు ప్రతిరోజూ ఫోన్ చేసి.. ‘అమ్మ ఎలా ఉన్నావు? మా దగ్గరకి ఎప్పుడు వస్తావు?’ అని అడిగేవాళ్లు. కొన్నిసార్లు నేను కన్నీళ్లు కూడా పెట్టుకున్నాను. కొంతమంది నెటిజన్లు.. సోషల్మీడియా వేదికగా నా పిల్లలకు ఫోన్ చేసి తిట్టారు. అంతేకాకుండా చనిపోవాలని పిచ్చి సలహాలు కూడా ఇచ్చారు. మరోవైపు భారత్లో ఉన్న నా తల్లిదండ్రులకూ.. ఎన్నో ఫోన్ కాల్స్. నా కుటుంబమంతా ఎంతో ఒత్తిడికి గురయ్యింది. అలాంటి క్షణాల్లోనూ నా కుటుంబం నాకు తోడుగా నిలిచింది. అందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని కనికా కపూర్ తెలిపారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్