వంద సినిమాలు చేయొచ్చు కానీ...
‘‘ఏదో ఒకటి చేయడం నాకు ఇష్టం ఉండదు. కథ బాగుంటేనే సినిమా చేయాలనుకుంటా. 1985లో దర్శకుడినై 33 సినిమాలే చేశానంటే కారణం అదే’’ అన్నారు సీనియర్ దర్శకుడు బి.గోపాల్.
‘‘ఏదో ఒకటి చేయడం నాకు ఇష్టం ఉండదు. కథ బాగుంటేనే సినిమా చేయాలనుకుంటా. 1985లో దర్శకుడినై 33 సినిమాలే చేశానంటే కారణం అదే’’ అన్నారు సీనియర్ దర్శకుడు బి.గోపాల్. అగ్ర కథానాయకులతో సినిమాలు తీసి వరుసగా విజయాలు అందుకున్నారీయన. సీనియర్లతో పాటు... నవతరం కథానాయకులతోనూ సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. గోపీచంద్ కథానాయకుడిగా ‘ఆరడుగుల బుల్లెట్’ తెర కెక్కించారు. ఆ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ వివరాలు...
‘‘నాకు వచ్చిన అవకాశాలకి వంద సినిమాలు అవలీలగా చేయొచ్చు. కానీ కథ విషయంలో ఆలోచించే అడుగులు వేస్తుంటా. కథ నచ్చకపోతే సినిమా వద్దనుకుంటా. నిర్మాత మొదలుకొని... కథా నాయకుడు, పంపిణీదారుడు, ప్రేక్షకుడు వరకు అందరూ సంతృప్తిగా ఉండాలి. ఆ సినిమాల్నే చేయాలనుకుంటా. ‘ఆరడుగుల బుల్లెట్’ తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని ఓ తండ్రి దూరంగా పెట్టడం, చివరికా కుటుంబం కష్టాల్లో పడేసరికి ఆ కొడుకే వచ్చి కాపాడటం ఈ సినిమా ప్రత్యేకత. చాలా మంది ట్రైలర్ చూసి ‘చాలా బాగుంది. మళ్లీ బి.గోపాల్ కనిపించార’ని మెచ్చుకున్నారు. వక్కంతం వంశీ రాసిన కథ, అబ్బూరి రవి మాటలు, గోపీచంద్ నటన... ఇలా ఇందులోని ప్రతీ అంశం ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’.
* ‘‘ఎవరి ప్రయాణాన్నయినా జయాపజయాలే ప్రభావితం చేస్తాయి. దర్శకుడిగా నాకు చాలా విరామం రావడానికి కారణం అదే. మధ్యలో కొన్ని అనుకున్నాం కానీ కుదరలేదు. కథ కుదిరితే ఒకేసారి రెండు సినిమాలు చేయడానికి నాకు ఇబ్బందేమీ ఉండదు. నా కెరీర్లో మూడుసార్లు ఒకేసారి రెండు సినిమాలు చొప్పున చేశా. ‘విజయ్’ - స్టేట్రౌడీ’, ‘లారీ డ్రైవర్ - బొబ్బిలిరాజా’, ‘ఇంద్ర’ - ‘అల్లరి రాముడు’... ఇలా ఇవన్నీ ఒకేసారి చేసిన సినిమాలే. నేను రచయితని కాను. వేరొకరి కథలతోనే సినిమాలు చేస్తుంటా. కొత్తతరం రచయితలతో కలిసి ప్రయాణం చేస్తుంటాను కాబట్టి... ట్రెండ్కి దగ్గరగానే ఉంటాను. స్క్రిప్ట్ బాగుంటే మాస్ కథలు సూపర్హిట్ అవుతాయి’’.
* ‘‘ఫ్యాక్షన్ కథలతో ప్రయాణం చేయాలని నేను ముందు అనుకుని చేసిన సినిమాలు కాదు. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’, ‘ఇంద్ర’ సినిమాల కథలు నా దగ్గరికొచ్చే వరకు అవి ఫ్యాక్షన్ కథలని నాకు తెలియదు. మళ్లీ ఎవరైనా కథ చెబితే ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా చేయడానికి సిద్ధమే. స్క్రిప్ట్, హీరోల ఇమేజ్లను బట్టి నా సినిమాల ప్రయాణం సాగుతుంటుంది. రీమేక్లంటే ఇష్టం ఉండదు. అందుకే ‘అసెంబ్లీరౌడీ’, ‘బ్రహ్మ’లాంటి ఒకట్రెండు రీమేక్లే చేశా. ఇటీవల బాలకృష్ణ కోసం కథలు సిద్ధం చేస్తున్నాం. బుర్రా సాయిమాధవ్, చిన్నికృష్ణ కథలు చెప్పారు. బాలకృష్ణతో ఇదివరకే ఓ సినిమాని మొదలుపెట్టాం కానీ అది పూర్తి కాలేదు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్