Music School: 45రోజుల్లో.. 10పాటలు
శ్రియ, షర్మన్ జోషి, సుహాసిని, షాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. పాపారావు బియ్యాల దర్శకుడు. యామిని ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇళయరాజా స్వరాలందిస్తున్నారు. ఈ చిత్ర
శ్రియ, షర్మన్ జోషి, సుహాసిని, షాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. పాపారావు బియ్యాల దర్శకుడు. యామిని ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇళయరాజా స్వరాలందిస్తున్నారు. ఈ చిత్ర మూడో షెడ్యూల్ తాజాగా పూర్తయింది. 45రోజుల షెడ్యూల్లో భాగంగా ఇప్పటికే 10 పాటల చిత్రీకరణ పూర్తిచేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా శ్రియ మాట్లాడుతూ.. ‘‘కీలక షెడ్యూల్ పూర్తయింది. ప్రకాష్, రాజు మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. షర్మన్తోనూ, పలువురు బాలనటులతోనూ కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం చేస్తున్నందుకు పాపారావుకు ధన్యవాదాలు’’ అంది. ‘‘నటీనటులందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా పిల్లలు చాలా మంచి నటన కనబర్చారు. 45రోజుల అద్భుతమైన షెడ్యూల్ని పూర్తి చేశాం. హైదరాబాద్లోనే చిత్రీకరణ జరిపాం. ఇప్పటి వరకు 80శాతం చిత్రీకరణ జరిపాం’’ అన్నారు దర్శకుడు. షర్మన్ జోషి మాట్లాడుతూ..‘‘సినిమాని చిత్రబృందం బాగా తీర్చి దిద్దుతోంది. పిల్లలకు సంబంధించిన డ్యాన్సులు, పాటల సీక్వెన్స్ను పూర్తి చేశాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్లో సెట్లోకి
గతేడాది బ్లాక్బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు