Music School: 45రోజుల్లో.. 10పాటలు

శ్రియ, షర్మన్‌ జోషి, సుహాసిని, షాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’. పాపారావు బియ్యాల దర్శకుడు. యామిని ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇళయరాజా స్వరాలందిస్తున్నారు. ఈ చిత్ర

Updated : 13 Mar 2022 08:45 IST

శ్రియ, షర్మన్‌ జోషి, సుహాసిని, షాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’. పాపారావు బియ్యాల దర్శకుడు. యామిని ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇళయరాజా స్వరాలందిస్తున్నారు. ఈ చిత్ర మూడో షెడ్యూల్‌ తాజాగా పూర్తయింది. 45రోజుల షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే 10 పాటల చిత్రీకరణ పూర్తిచేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా శ్రియ మాట్లాడుతూ.. ‘‘కీలక షెడ్యూల్‌ పూర్తయింది. ప్రకాష్‌, రాజు మాస్టర్‌ కొరియోగ్రఫీ చాలా బాగుంది. షర్మన్‌తోనూ, పలువురు బాలనటులతోనూ కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం చేస్తున్నందుకు పాపారావుకు ధన్యవాదాలు’’ అంది. ‘‘నటీనటులందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా పిల్లలు చాలా మంచి నటన కనబర్చారు. 45రోజుల అద్భుతమైన షెడ్యూల్‌ని పూర్తి చేశాం. హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరిపాం. ఇప్పటి వరకు 80శాతం చిత్రీకరణ జరిపాం’’ అన్నారు దర్శకుడు. షర్మన్‌ జోషి మాట్లాడుతూ..‘‘సినిమాని చిత్రబృందం బాగా తీర్చి దిద్దుతోంది. పిల్లలకు సంబంధించిన డ్యాన్సులు, పాటల సీక్వెన్స్‌ను పూర్తి చేశాం’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని