Abhishek Bachchan: బాలీవుడ్లో టాలెంట్కు కొరత లేదు: అభిషేక్ బచ్చన్
‘బాహుబలి’, ‘బాహుబలి-2’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్’, ‘కేజీయఫ్-2’ ఇలా వరుస భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సంగతి తెలిసిందే....
సౌత్, హిందీ చిత్రపరిశ్రమలపై నటుడు షాకింగ్ కామెంట్స్
ముంబయి: ‘బాహుబలి’, ‘బాహుబలి-2’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్’, ‘కేజీయఫ్-2’ ఇలా వరుస భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఆయా చిత్రాలు బాలీవుడ్లోనూ సూపర్సక్సెస్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడందరి చూపు దక్షిణాదిపైనే ఉంది. దీంతో బాలీవుడ్, దక్షిణాది నటీనటుల మధ్య పరోక్షంగా మాటల యుద్ధం నడుస్తోంది.
కాగా, తాజాగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సైతం దక్షిణాది చిత్రపరిశ్రమపై కామెంట్స్ చేశారు. దక్షిణాదికి చెందిన చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ కావడంపై ఆయన స్పందించారు. రీమేక్స్ చేయడమంటే ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకోవడం మాత్రమేనని అన్నారు. ‘‘భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఎంతో పెద్దది. ఎన్నో భాషలు, సంస్కృతులతో కూడుకున్నది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపుదిద్దుకున్న చిత్రాలు దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా రీమేక్ అవుతుంటాయి. హిందీ సినిమాలను కూడా రీమేక్ చేస్తుంటారు. రీమేక్ చేయడమంటే క్రియేటివ్ ఆలోచనలు పంచుకోవడమే. దక్షిణాది చిత్రాలు హిందీలోకి, అలాగే ఇక్కడి సినిమాలు అక్కడి భాషలకు రీమేక్ చేయడమనేది సుమారు 70 ఏళ్ల నుంచి జరుగుతోంది. రీమేక్ చేస్తున్నామంటే అర్థం బాలీవుడ్లో టాలెంట్కి కొరత ఉందని కాదు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి ఏడాది వెయ్యికి పైగా చిత్రాలు బయటకు వస్తుంటాయి. (ఆర్ఆర్ఆర్, కేజీయఫ్-2ని ఉద్దేశిస్తూ..) అందులో కేవలం రెండు చిత్రాలే ట్రెండ్ని ఎలా నిర్దేశిస్తాయి..?’’ అని అభిషేక్ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
-
జనం ఆస్తులతో.. జగనన్న భూమంతర్..!