‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు.
ఇంజినీర్లు, నిర్మాణదారుల వివరణ కోరే అవకాశం
నేటి నుంచి జ్యుడిషియల్ కమిషన్ పర్యటన.. రేపు మేడిగడ్డకు
ఈనాడు, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. సోమవారం నుంచి జస్టిస్ పీసీ ఘోష్ రెండో దఫా విచారణ చేపట్టనున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఏడో తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. దీని పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. వాతావరణ పరిస్థితులను బట్టి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా సందర్శించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. అదేరోజు రాత్రి రామగుండంలోని ఎన్టీపీసీ వసతిగృహంలో బస చేసి.. మరుసటి రోజు హైదరాబాద్ చేరుకుంటారు. తొమ్మిదో తేదీన హైదరాబాద్లోని బీఆర్కే భవన్లోని కాళేశ్వరం విచారణ కమిషన్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమవుతారు. 10, 11 తేదీలకు సంబంధించిన షెడ్యూలు ఖరారు కాలేదు. ఈ దఫా పర్యటనలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. బ్యారేజీల వైఫల్యాలకు సంబంధించి ఇంజినీర్లు, నిర్మాణదారుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.
ఆ మూడు ఆదేశాలకు సమాధానాలపైనా: మొదటి దఫా విచారణ సందర్భంగా ప్రభుత్వానికి కమిషన్ మూడు ఆదేశాలు జారీ చేసింది. 2015లో ఏర్పాటైన ఆరుగురు సభ్యుల కమిటీకి సంబంధించిన నివేదిక సమర్పించాలని కోరింది. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ల నుంచి సమాచారం తెప్పించాలనీ ఆదేశించింది. ఆరుగురు సభ్యుల కమిటీ నివేదికకు సంబంధించి ప్రభుత్వం నుంచి నీటిపారుదల శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. కమిటీ నివేదిక, చర్యలకు సంబంధించి వివరణ పంపాలని రామగుండం సీఈకి నీటిపారుదల శాఖ లేఖ రాసినట్లు తెలిసింది. బ్యారేజీల పునరుద్ధరణపై ఎన్డీఎస్ఏకు ప్రభుత్వం లేఖ రాయగా.. ఇంకా ప్రత్యుత్తరం అందలేదని సమాచారం. అలాగే, విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్న దస్త్రాలను అప్పగించాలంటూ విజిలెన్స్కు నీటిపారుదల శాఖ లేఖ రాసినప్పటికీ సమాధానం అందలేదని తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎప్సెట్ ఫలితాలు నేడే
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి. -
కొత్తగా 203 పంచాయతీల్లో బడులు
రాష్ట్రంలో కొత్తగా 203 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఇదీ సంగతి!
-
హైదరాబాద్లో 200 ఎకరాల్లో ఏఐ సిటీ
కృత్రిమ మేధ(ఏఐ)లో హైదరాబాద్ను ప్రపంచంలోనే సమున్నత స్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. -
ఆలస్యానికి రూ.460 కోట్ల జరిమానా!
థర్మల్ విద్యుత్కేంద్రాల పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థ భెల్(బీహెచ్ఈఎల్)కు తెలంగాణ జెన్కో భారీ జరిమానా విధించింది. కాంట్రాక్టు ఒప్పందాల గడువు దాటినా పూర్తిచేయకుండా జాప్యం చేస్తున్నందుకు రూ.460 కోట్లు కట్టాలని భెల్కు స్పష్టంచేసింది.