Malli Pelli: నరేశ్- పవిత్రల ‘మళ్లీపెళ్లి’.. కోర్టును ఆశ్రయించిన రమ్య రఘుపతి
నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘మళ్లీపెళ్లి’. ఈ సినిమా విడుదల ఆపాలంటూ నరేశ్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు.
ఇంటర్నెట్ డెస్క్: మే 26న విడుదలకాబోతున్న ‘మళ్లీపెళ్లి’ (malli pelli) సినిమా విడుదలను ఆపాలంటూ నరేశ్ (naresh) భార్య రమ్య రఘుపతి (ramya raghupathi) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ చిత్రంలోని సన్నివేశాలు తనని కించపరిచేలా ఉన్నాయని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. సినిమా విడుదలకు కొన్ని గంటలే సమయం ఉండడంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతటా ఆసక్తి నెలకొంది.
మరోవైపు ఈ సినిమాపై నరేష్, పవిత్రా లోకేశ్లో ఓ టెలివిజన్ వేదికగా సినిమాపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘మేము రిలేషన్షిప్లో ఉన్నాం. దాంతో కొన్ని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత అన్ని విషయాలు మేం పంచుకున్నాం. మన లైఫ్ కోసం మనం పోరాడుతున్నాం. ఈ ప్రపంచంలో లక్షల మంది దంపతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వాళ్లలో మేము (నరేష్-పవిత్ర) కూడా ఉన్నాం. సమాజానికి భయపడి బతకడం సరికాదు. అందుకే ఈ సినిమా చేయాలనుకున్నాం. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. చాలా సన్నివేశాలు మా జీవితానికి దగ్గర ఉంటాయి. సెలబ్రిటీ కపుల్ ద్వారా చెబితే మరింత ప్రభావంగా ఉంటుందని దర్శకుడు ఎం.ఎస్.రాజు అభిప్రాయపడ్డారు. అందుకు మేము కూడా అంగీకరించాం. అయితే, ‘తప్పు మాది కాదు ఫలానా వాళ్లు చేశారు’ అని మేము చెప్పాలనుకోవడం లేదు. అలా అనుకుంటే, మీడియా ముందుకు వచ్చి చెబుతాం. సినిమాగా తీయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది మాత్రమే. అదే సమయంలో లక్షల మంది భావోద్వేగాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం’’ అని నరేష్, పవిత్రా లోకేశ్ అన్నారు.
నరేశ్, పవిత్ర లోకేశ్ (Pavitra Lokesh) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎం.ఎస్. రాజు (ms raju) తెరకెక్కించిన చిత్రమిది. జయసుధ, శరత్బాబు, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేశ్, రమ్య రఘుపతికి మధ్య మనస్పర్థలు తలెత్తిన సంగతి తెలిసిందే. అదే సమయంలో నరేశ్.. పవిత్రతో చనువుగా ఉండడం హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో నరేశ్ ‘మళ్లీపెళ్లి’ అంటూ సినిమాని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల ఇతివృత్తంగా ఈ సినిమాని తెరకెక్కించి ఉంటారని అనేకమంది భావించారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్లు చూసిన వారూ అదే అనుకున్నారు. అయితే, అది నరేశ్ లైఫ్ స్టోరీ కాదని, సినిమా చూస్తే అసలు విషయం అర్థమవుతుందని దర్శకుడు ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
Raja Saab: ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే..
విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మరోసారి వాయిదా పడింది. -
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
Sundeep Kishan: సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించిన ‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్గా ‘మాయ-వన్’ రాబోతోంది -
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
‘కన్నప్ప’ సినిమా క్రేజీ అప్డేట్ ఇచ్చారు హీరో మంచు విష్ణు. అదేంటంటే? -
కమల్ హాసన్ సినిమాలో బాలీవుడ్ హీరో.. గౌరవంగా ఉందంటూ పోస్ట్
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’లో బాలీవుడ్ హీరో అలీ ఫజల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. -
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
నటి రష్మిక తన అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. మరో క్రేజీ ప్రాజెక్ట్లో అవకాశమం వచ్చినట్లు తెలిపారు. -
‘ఆరంభం’ టీమ్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది: వెంకటేష్ మహా
‘ఆరంభం’ సినిమా మే10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’లపై ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు. -
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
‘సలార్’లో తన పాత్రపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. -
‘దేవర’ ఎన్టీఆర్కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే?
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం