Double Ismart: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ అప్‌డేట్‌ షేర్‌ చేసిన పూరి జగన్నాథ్‌..

పూరి జగన్నాథ్‌- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ నుంచి అప్‌డేట్‌ వచ్చింది.

Published : 04 May 2024 13:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అంటూ మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు పూరి జగన్నాథ్‌. ఆయన దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం విజయాన్ని సాధించడంతో దానికి సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను రూపొందిస్తున్నారు. ఈ మూవీ నుంచి అప్‌డేట్‌ వచ్చి నెలలు గడుస్తుండడంతో అభిమానులు చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. తాజాగా పూరి దీనిపై అప్‌డేట్‌ ఇస్తూ కొన్ని ఫొటోలు పంచుకున్నారు. ముంబయిలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైనట్లు తెలిపిన ఆయన.. సినిమాలోని కీలక అంశాలను చిత్రీకరించనున్నట్లు చెప్పారు. ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేశారు. మే15న రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను షేర్‌ చేయాలని కోరుతూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?

2019లో విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సూపర్‌ హిట్‌ కావడంతో దీన్ని హిందీతో సహా పలుభాషల్లో రీమేక్‌ చేశారు. అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. అందుకే ఇప్పుడు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను (Double Ismart) పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. చార్మి, పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గతంలో రామ్‌ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. జూన్‌లో ఈ చిత్రం విడుదలచేయనున్నట్లు తెలిపారు. ఈ సారి వినోదం, యాక్షన్‌ అన్నీ డబుల్‌ ఉంటాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని