Aarambham: ‘ఆరంభం’ టీమ్‌ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది: వెంకటేష్‌ మహా

‘ఆరంభం’ సినిమా మే10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Updated : 09 May 2024 11:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోహన్‌ భగత్‌, సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్ కల్యాణ్‌ రవీంద్ర, విజయ్‌ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambham). అజయ్‌ నాగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డైరెక్టర్‌ వెంకటేష్‌ మహా, శ్రీ విష్ణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

‘కొత్తగా ప్రయత్నించడం తేలికైన విషయం కాదు. పరిశ్రమలో నిలబడాలంటే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కోవాలి. ఇంత కఠినమైన ప్రయాణంలో కొత్త కథలతో ప్రేక్షకులను అలరించడం చాలా కష్టం. ‘ఆరంభం’ టీమ్‌ వాటన్నింటినీ ఎదుర్కొని మీ ముందుకు వస్తోంది. ఆశీర్వదించండి. తెలుగు ఆడియన్స్‌ అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారు. రాజమౌళి, సుకుమార్‌ లాంటి పెద్ద దర్శకులు తెలుగు సినిమాకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కష్టపడుతున్నారు. మాలాంటి దర్శకులంతా కొత్త తరానికి స్వాగతం పలుకుతూ వినూత్న కథలను అందిస్తున్నాం. అలాంటి కథే ‘ఆరంభం’’ అని వెంకటేష్‌ మహా అన్నారు. సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా హిట్‌ అవుతుందని ట్రైలర్‌ చూస్తేనే అర్థమైంది. ఇది పూర్తిగా టీమ్‌ వర్క్‌. ఇంత కష్టపడి తెరకెక్కించారు కాబట్టి ఈ ఆరంభం మీకు ఎప్పటికీ గుర్తుంటుంది. 2 ఏళ్ల తర్వాత ఈ టీమ్‌లోని వారంతా గొప్ప స్థాయిలో ఉంటారు. మే 10న థియేటర్స్‌కు వచ్చి ఎంజాయ్ చేయండి’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని