Gangs of Godavari: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్‌ డేట్‌ ఇదే..

విశ్వక్‌సేన్‌ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ సినిమా మరోసారి వాయిదా పడింది.

Published : 09 May 2024 20:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్: విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా కృష్ణచైతన్య రూపొందించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి (Neha Shetty) హీరోయిన్‌. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని మరోసారి పోస్ట్‌పోన్‌ చేశారు దర్శక, నిర్మాతలు. మే 17న విడుదల కావాల్సిన ఈ మూవీని మే 31న రిలీజ్‌ చేయనున్నట్టు గురువారం ప్రకటించారు. ఈమేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ పంచుకున్నారు.

విశ్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ఫలక్‌నుమా దాస్‌’ 2019 మే 31న విడుదలై, మంచి విజయం అందుకుంది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ అదే తేదీన విశ్వక్‌ మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాడని చిత్ర బృందం పేర్కొంది. ఈ యాక్షన్‌ ఫిల్మ్‌ గతేడాది డిసెంబరులోనే విడుదల కావాల్సింది. ఆ తర్వాత మార్చికి వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని