Bhagavanth kesari: ఆ దమ్ము - ధైర్యం... నాన్న నుంచి వచ్చిన వారసత్వం
‘‘తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిలాష, అభిరుచి ఉంటుంది. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. వాళ్లు అడిగేవరకు ఆగకుండా మనమే ముందడుగు వేస్తే ఆ ఫలితం ఈ సినిమాలా ఉంటుంది’’ అన్నారు నందమూరి బాలకృష్ణ.
భగవంత్ కేసరి వేడుకలో బాలకృష్ణ
‘‘తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిలాష, అభిరుచి ఉంటుంది. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. వాళ్లు అడిగేవరకు ఆగకుండా మనమే ముందడుగు వేస్తే ఆ ఫలితం ఈ సినిమాలా ఉంటుంది’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన ‘భగవంత్ కేసరి’ విజయోత్సవం గురువారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రమిది. కాజల్ కథానాయిక. శ్రీలీల ముఖ్యభూమిక పోషించింది. సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. విజయోత్సవానికి ముఖ్య అతిథులుగా కె.రాఘవేంద్రరావు, అంబికా కృష్ణ హాజరయ్యారు. సక్సెస్ టికెట్ని ఆవిష్కరించిన బాలకృష్ణ వేడుకని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఒక మంచి సినిమాని ఇచ్చినప్పుడు ప్రేక్షకులు నీరాజనాలు పలికారంటే అంతకుమించిన సంపాదన, సంతోషం మరేదీ లేదు. వైవిధ్యమైన పాత్రల్ని చేసే దమ్ము, ధైర్యం, నమ్మకం మా నాన్న నుంచి వచ్చిన వారసత్వం. నావరకూ మూడు తరాలుగా ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నానంటే నా పూర్వజన్మ సుకృతం. పాత్రల కోసం నటీనటులు ఎంతో కష్టపడ్డారు. సాంకేతిక నిపుణులు కూడా అంతే శ్రమించారు. నా సినిమాలకి నా సినిమాలే పోటీ. చేసే విభిన్నమైన పాత్రలు, నిర్మాతలకి నాపైన ఉన్న నమ్మకం, దర్శకులు నన్ను మలిచే కోణం, రచయితలు నాతో పలికించే మాటలు, వీటన్నిటి ఫలితమే ఈ విజయ పరంపర. మాలో చాలా మందికి ఈ సినిమా ప్రత్యేకం. ‘అఖండ,’ ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’... ఇవన్నీ నాకు సవాల్ విసిరిన సినిమాలే. అందరి కృషి ఫలితమే ఈ సినిమా విజయం. బాలకృష్ణ సినిమా అంటే వేరు. షడ్రుచులు ఉండాలి, అలాంటి సినిమాని అనిల్ రావిపూడి ఇచ్చారు. ఒక మంచి సందేశం ఇస్తున్నాం అన్నప్పుడు దేనికైనా సిద్ధపడాలి. అందుకే నేను చిచ్చాగా నటించా. అలాంటప్పుడే మనం చెప్పింది ప్రజల్లోకి బలంగా వెళుతుంది. సినిమాకి మించిన బలమైన మాధ్యమం మరొకటి లేదు. అందుకే నా బాధ్యతగా స్వీకరించి కథ చెప్పిన వెంటనే చేద్దామని అంగీకారం తెలిపా. నిర్మాతలు మంచి సినిమా చేయాలనే పరిశ్రమలోకి వచ్చారు. హిందీలో కూడా ఈ సినిమా డబ్ అవుతోంది. తొలిసారి హిందీలో డబ్బింగ్ చెప్పాను. ప్రయోగం చేయడం నాన్న గారి నుంచే నాకు అలవాటు. తెలుగువాళ్ల సత్తా ఈ సినిమా నిరూపిస్తుంది’’ అన్నారు.
- కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ఇందులో బాలకృష్ణని చూసినప్పుడు నాకు ఎన్టీఆర్ గుర్తొచ్చారు. విజ్జి పాప తన గురించి మాట్లాడే సన్నివేశంలో చాలా బాగా చేశాడు. బాలయ్య విజయపతాకం ఎగురుతూనే ఉండాలి. డ్యాన్స్ అయినా, ఫైట్ అయినా, సెంటిమెంట్ సన్నివేశాలైనా శ్రీలీల అవలీలగా చేస్తుంది. అనిల్ అన్ని రకాల సినిమాలూ చేస్తున్నాడ’ని అభినందించారు’’.
- తమన్ మాట్లాడుతూ ‘‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’... బాలకృష్ణతో హ్యాట్రిక్ కొట్టానన్న ఆనందంలో ఉన్నా’’ అన్నారు. శ్రీలీల మాట్లాడుతూ ‘‘ఇలాంటి పాత్రల్ని చేయగలుగుతాననే నమ్మకాన్ని పెంచిందీ చిత్రం. నా చిచ్చాని మిస్ అవుతున్నా’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘ఆరేళ్ల నుంచి అరవయ్యేళ్ల వరకు అందరూ కలిసి కుటుంబ సమేతంగా చూస్తున్న సినిమా. నా కెరీర్లో గొప్ప సినిమా అయ్యింది. ప్రపంచకప్లో భారత్ జట్టు ఎంత ఫామ్లో ఉందో, బాలయ్యబాబు అంత ఫామ్లో ఉన్నారు. ఈ విజయపరంపర ఇలాగే కొనసాగాలి. అవార్డుల గురించి నాకు పెద్దగా తెలియదు. వాటికి మనసుంటే బాలకృష్ణ, శ్రీలీల దగ్గరికి రావాలి. అంత బాగా నటించార’’న్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా.. -
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
మహేష్బాబు, పూరి జగన్నాథ్ల కాంబినేషన్కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. -
ఉన్నతమైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసొస్తున్నాయి
ఎదురు చూపులకి తెర పడింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శనివారం ప్రకటించాయి. -
ప్రేమ వివాహమే చేసుకుంటా!
‘జాతిరత్నాలు’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడామె అల్లరి నరేశ్తో కలిసి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’తో అలరించేందుకు సిద్ధమైంది. -
కృష్ణ జయంతికి ‘హరోం హర’
‘హరోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. -
‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు
ప్రభుదేవా - శంకర్ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని మే 1న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు రమణ, మురళీధర్ రెడ్డి ప్రకటించారు. -
ఆ లాజిక్తోనే ప్రసన్న వదనం తీశాడు
‘‘నేను తీసిన ‘100%లవ్’ మొదలుకొని నా ప్రతి సినిమాకీ పనిచేశాడు అర్జున్. తను హాలీవుడ్లో ఉండి ఉంటే మరో స్థాయిలో సినిమాలు తీసేవాడు. -
ఈసారి శివాలెత్తిపోద్ది
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీని గురించి నేనొక్కటే చెప్తాను. ఈసారి శివాలెత్తిపోద్ది’’ అన్నారు విష్వక్ సేన్. ఆయన హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. -
మూడు జంటల కథ.. ఖేల్ ఖేల్ మే
వినోదాన్ని పంచే ఏ సినిమా కోసమైనా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ జాబితాలోకే చేరే ‘ఖేల్ ఖేల్ మే’ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు వినిపించింది చిత్రబృందం. -
అవి నా జీవితంలో చీకటి రోజులు!
‘‘నా జీవితంలోనే నేను అనుభవించిన ఓ చీకటి దశ ఇద’’ని అంటోంది నాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. -
తండ్రీ తనయుల సంఘర్షణ
తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి... ‘నాన్నలందరూ ఇంతే, అర్థం చేసుకోర’ంటూ బాధపడే ఓ తనయుడు... -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
పింఛను లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి