‘ఉప్పెన’ మరో ‘రంగస్థలం’
‘‘మన మట్టి కథలు, మన భూమి కథలు రావాలి. మోడ్రన్ కథలు, ట్రెండీ సినిమాలంటూ మనం మరో దారిలోకి వెళ్లిపోతున్నాం. కనుమరుగై పోతున్న మన కథల్ని గుర్తు చేస్తూ, ఇదీ మన నేపథ్యం అని చెప్పిన మరో సినిమా ‘ఉప్పెన’ అవుతుంద’’న్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి.....
‘‘మన మట్టి కథలు, మన భూమి కథలు రావాలి. మోడ్రన్ కథలు, ట్రెండీ సినిమాలంటూ మనం మరో దారిలోకి వెళ్లిపోతున్నాం. కనుమరుగై పోతున్న మన కథల్ని గుర్తు చేస్తూ, ఇదీ మన నేపథ్యం అని చెప్పిన మరో సినిమా ‘ఉప్పెన’ అవుతుంద’’న్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన మేనల్లుడు పంజా వైష్ణవ్తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. కృతిశెట్టి కథానాయిక. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ నెల 12న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. శనివారం హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ ‘‘కరోనాతో యేడాది కాలం పాటు భవిష్యత్తు తెలియక ఇంటికే పరిమితమయ్యాం. ఇప్పుడు మళ్లీ ఓ శుభారంభంలా అనిపిస్తోంది. ‘ఉప్పెన’ సినిమా ఒక దృశ్యకావ్యం, అద్భుతం అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇది మరో ‘రంగస్థలం’ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బుచ్చిబాబు చూపించిన పనితనం, దర్శకత్వ విలువలు గొప్పగా ఉంటాయి. స్క్రీన్ప్లేకి ఇదొక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. 80, 90ల్లో భారతీరాజా తీసిన సినిమాలు గుర్తుకొచ్చాయి. విజయ్ సేతుపతి నటనతో ఈ సినిమా మరో స్థాయికి వెళ్లింది. తొలి సినిమా అయినా కృతిశెట్టి చాలా బాగా చేసింది. వైష్ణవ్ మా కుటుంబానికి గర్వకారణం. అంత బాగా నటించాడు. మైత్రీ సంస్థ కథానాయకులందరికీ ఇష్టమైన నిర్మాణ సంస్థ అయ్యిందంటే సినిమాపై వాళ్లకున్న ప్రేమే కారణం’’ అన్నారు.
కృతిశెట్టి మాట్లాడుతూ ‘‘సుకుమార్ నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఆయన చెప్పిన మాటలు మనసులో ఉంటాయి. ఈ సినిమా చేయడం నా అదృష్టం. వైష్ణవ్తో ప్రయాణం చాలా బాగుంది’’ అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ ‘‘సుకుమార్ సర్ నాకు లెక్కలు చెప్పకపోతే మరొకటేదో చేసుకునేవాణ్ని. దర్శకత్వం మాత్రం కాదు. ‘ఉప్పెన’ కథని ఎలా రాశానో, అలాగే తీసే అవకాశాన్నిచ్చారు ఈ చిత్ర నిర్మాతలు. చాలా భావోద్వేగంతో రాసిన కథ ఇది’’ అన్నారు.
వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ‘‘మా అమ్మ త్యాగం లేకపోతే, మా మావయ్యలు లేకపోతే నేను, మా అన్నయ్యలు ఇక్కడివరకు వచ్చేవాళ్లం కాదు. జీవితాంతం మా మావయ్యలకి రుణపడి ఉంటాం. బుచ్చిబాబు రాసిన కథే ఈ సినిమాకి హీరో’’ అన్నారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘‘ఈ కథలో ఆత్మ ఉంది. సంభాషణలు చాలా బాగా నచ్చాయి’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ ‘‘బుచ్చిబాబు ‘ఉప్పెన’ కథ చెప్పగానే గది మొత్తం గంభీరమైంది. అప్పుడే ఇది వంద కోట్ల సినిమా అని చెప్పా. చాలా భవిష్యత్తు ఉన్నవాడు బుచ్చిబాబు. ఇంత సులభంగా ‘ఉప్పెన’ కనిపిస్తుంది కానీ, బుచ్చి ఈ సినిమా కోసం చాలా కష్టమైన ప్రయాణం చేశాడు.’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో కిషోర్ తిరుమల, వెంకీ కుడుముల, సందీప్రెడ్డి వంగా, శివ నిర్వాణ, గోపీచంద్ మలినేని, బాబీ, కొరటాల శివ, హరీష్ శంకర్, దేవీశ్రీప్రసాద్, చంద్రబోస్, రామకృష్ణ - మౌనిక, ఛాయాగ్రాహకుడు శ్యామ్దత్ సైనుద్దీన్, చెర్రీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.