Shyam Singha Roy: ‘శ్యామ్ సింగరాయ్’తో ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారు!
‘‘ప్రేక్షకుడిని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాలని తాపత్రయపడే ప్రతీ మేకర్కి నా జోహార్లు. అలాంటి మరో ప్రయత్నమే ఈ సినిమాతో మేం చేశాం. యాభై ఏళ్లు వెనక్కి వెళ్లి ప్రేక్షకులు ఓ సరికొత్త ప్రపంచాన్ని చూస్తార’’న్నారు రాహుల్ సాంకృత్యాన్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. నాని కథానాయకుడు
‘‘ప్రేక్షకుడిని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాలని తాపత్రయపడే ప్రతీ మేకర్కి నా జోహార్లు. అలాంటి మరో ప్రయత్నమే ఈ సినిమాతో మేం చేశాం. యాభై ఏళ్లు వెనక్కి వెళ్లి ప్రేక్షకులు ఓ సరికొత్త ప్రపంచాన్ని చూస్తార’’న్నారు రాహుల్ సాంకృత్యాన్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. నాని కథానాయకుడు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా కథానాయకుడు నాని మాట్లాడుతూ... ‘‘మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు. ఎప్పుడూ సింపుల్గా వచ్చే నేను ఈ ఫంక్షన్కు కోటు వేసుకొచ్చాను. సినిమా చూశాకా నాకంత ధైర్యం వచ్చింది. మాకు ఇంత ప్రేమను అందిస్తున్న తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా ఇస్తున్నాం. ఈ క్రిస్మస్ మనదే ’’ అని చెప్పారు. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ ‘‘ఒక గొప్ప చిత్రం వెయ్యి కొత్త చిత్రాల్ని తీసే శక్తినిస్తుంది. సత్యదేవ్ జంగా ఈ కథాంశాన్ని తీసుకుని వచ్చినప్పుడు అందులో బెంగాలీ నేపథ్యం ఆసక్తిని రేకెత్తించింది. ఆ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. చిత్రం ఒక్కరివల్లే జరగదు. ఛాయాగ్రాహకుడు సాను జాన్ వర్గీస్, సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్, ఎడిటర్ నవీన్ నూలి... ఇలా సాంకేతిక బృందం అంతా చక్కటి సహకారం అందించింది. ఈ కథకి నిర్మాత వెంకట్ దొరకడం మా అదృష్టం. సిరివెన్నెల సీతారామశాస్త్రి సర్తో పాట రాయించుకోవడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఒక షెడ్యూల్ తర్వాత ధైర్యం తెచ్చుకుని ఆయన దగ్గరికి వెళ్లా. ఆయన ప్రాణం పెట్టి రాశారు. సిరివెన్నెల ఆఖరి పాట మాకు వచ్చిందంటే ఇది విధి కాకపోతే మరేమిటి? అంతటి మహానుభావుడు సంతకం పెట్టి ఇది చివరి పాట అవుతుందని చెప్పి వెళ్లిపోయారు. నానికి సరైన స్క్రిప్ట్ ఇప్పటిదాకా దొరకలేదు. నటుడిగా ఆయనబలం ముందు ముందు చూడనున్నాం’’ అన్నారు. వేణుశ్రీరామ్ మాట్లాడుతూ ‘‘నాని... నా కెరీర్నే కాకుండా, చాలామంది కెరీర్లని పునః ప్రారంభించారు. ఆయన మనసు గెలవాలంటే మంచి కథ ఉంటే సరిపోతుంది. దర్శకుల్ని ప్రోత్సహించడమే కాకుండా, ఆయన సంపాదించింది సినిమాల్లోనే పెట్టి చాలా మంది కొత్తవాళ్లకి అవకాశాల్ని ఇస్తున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్రవంతి రవికిశోర్, పి.కిరణ్, అనిల్ సుంకర, రామ్ ఆచంట, సుధాకర్ చెరుకూరితోపాటు, శైలేష్ కొలను, నీరజ కోన, సత్యదేవ్, ఆనంద్, కృష్ణకాంత్, వేణు కుమారి, మనీష్, అవినాష్, వెంకటరత్నం, విశ్వ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్