Sabavath nayak: ఇరవయ్యేళ్ల కల.. చే
క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘చే’. లాంగ్ లివ్... అనేది ఉపశీర్షిక. సభావత్ నాయక్ దర్శకత్వం వహిస్తూ... ప్రధాన పాత్రని పోషించారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించారు.
క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘చే’. లాంగ్ లివ్... అనేది ఉపశీర్షిక. సభావత్ నాయక్ దర్శకత్వం వహిస్తూ... ప్రధాన పాత్రని పోషించారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించారు. లావణ్య సమీరా, పూల సిద్ధేశ్వర్, కార్తీక్ నూనె, పసల ఉమా మహేశ్వర్ కీలక పాత్రధారులు. ఈ నెల 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. జనసేన నాయకురాలు రాయపాటి అరుణ, ‘ప్రత్యర్థి’ దర్శకుడు శంకర్, నటుడు మాణిక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు, కథానాయకుడు సభావత్ నాయక్ మాట్లాడుతూ ‘‘తొమ్మిదో తరగతిలో చేగువేరా గురించి చదివాక ఆయన జీవితాన్ని సినిమాగా తీసుకురావాలని కల కన్నా. మధ్యలో కథానాయకుడు పవన్కల్యాణ్ మాటలు నా లక్ష్యాన్ని గుర్తు చేస్తూ... నాలో మరింతగా స్ఫూర్తిని రగిలించేవి. తోపుడు బండిపై తినుబండారాలు అమ్ముతూ, పైసా పైసా పోగు చేస్తూ నా లక్ష్యానికి చేరువయ్యా. చేగువేరా గౌరవం ఏమాత్రం తగ్గకుండా సినిమాని తీశా. ‘చే’తో ఇరవయ్యేళ్ల నా శ్రమ ఫలించింది. చేగువేరా కూతురు డా.అలైదా గువేరా స్వయంగా మా సినిమా ప్రచార చిత్రాల్ని విడుదల చేసి మమ్మల్ని అభినందించారు. సెన్సార్ బృందం మా సినిమాని చూసి మెచ్చుకున్నార’’ని చెప్పారు. ‘‘యువతరం ఇలాంటి సినిమాల్ని చూడాలి’’ అన్నారు జనసేన నాయకురాలు రాయపాటి అరుణ. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ప్రభు, భరద్వాజ్, నటుడు వివారెడ్డితోపాటు చిత్రబృందం పాల్గొంది.
చేనేత కార్మికులకు అంకితం ఈ సినిమా
‘జోరుగా హుషారుగా’ చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నారు విరాజ్ అశ్విన్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అను ప్రసాద్ తెరకెక్కించారు. నిరీష్ తిరువిధుల నిర్మించారు. పూజిత పొన్నాడ కథానాయిక. ఈ సినిమా ఈనెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఇందులో దర్శకుడు వశిష్ఠ, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో విరాజ్ మాట్లాడుతూ.. ‘‘ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో నేను చేనేత కార్మికుల కుటుంబం నుంచి వచ్చిన సంతోష్గా కనిపిస్తాను. దీంట్లో చేనేత కార్మికుల గురించి ఒక ప్రత్యేకమైన పాట పెట్టాం’’ అన్నారు. ‘‘పోచంపల్లి చేనేత కార్మికుల గురించి దీంట్లో చాలా చక్కగా చూపించారు. నేనిందులో చేనేత కార్మికుడిగా నటించడం నా అదృష్టం. ఈ సినిమాని చేనేత కార్మికులకు అంకితమిస్తున్నాం’’ అన్నారు నటుడు సాయికుమార్. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, దామోదర ప్రసాద్, వేణుగోపాల్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.
శాంతలకు కథే బలం
‘పరిమిత వ్యయంతో రూపొందిన మంచి చిత్రాలకు ప్రేక్షకుల ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. ఈ ఏడాది ‘జైలర్’, ‘జవాన్’, ‘యానిమల్’ తరహా భారీ సినిమాలతోపాటు... ‘బలగం’, ‘బేబి’ లాంటి చిత్రాల్నీ చూశారు. బలమైన కథతో రూపొందిన మా ‘శాంతల’ కూడా ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది’’ అన్నారు కె.ఎస్.రామారావు. ఆయన క్రియేటివ్ కమర్షియల్ సూపర్ విజన్ పతాకంపై ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న చిత్రం ‘శాంతల’. నిహాల్ కోదాటి, ఆశ్లేష ఠాకూర్ జంటగా నటించారు. శేషు పెద్దిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇర్రింకి సురేశ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ప్రత్యేక ప్రదర్శనని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ‘‘కథే బలంగా రూపొందిన చిత్రమిది. రెండేళ్లుగా కష్టపడి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆ స్థాయిలోనే విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
‘కృష్ణమ్మ’ సినిమా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. -
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించి వస్తున్న కథనాలపై నిర్మాణ సంస్ధ క్లారిటీ ఇచ్చింది. -
వెనుదిరగక వెతుకు
‘ఇలాంటి పాత్రని పోషించడం నాకెరీర్లో ఇదే మొదటిసార’ని చెబుతున్నారు కాజల్ అగర్వాల్. ఆమె ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యభామ’. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. -
జోడీ.. తేలేదెప్పుడో?
కథానాయకులతో కథ సెట్టయ్యిందంటే చాలు ఆ తర్వాత కసరత్తులన్నీ ఆయనకు జోడీగా కనిపించే నాయిక చుట్టూనే తిరుగుతుంటాయి. సినీప్రియుల అభిరుచులకు తగ్గట్లుగా కొత్త భామతో ముందుకెళ్లాలా.. మార్కెట్ను ప్రభావితం చేసేలా హిట్టు జోడీని పునరావృతం చేయాలా.. -
‘గోట్’కి ‘అవతార్’ నిపుణుల వీఎఫ్ఎక్స్
అగ్ర కథానాయకుడు విజయ్ హీరోగా భారీ బడ్జెట్తో, అత్యంత భారీ అంచనాల మధ్య ముస్తాబవుతున్న చిత్రం ‘గోట్’. వెంకట్ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రానికి మరో ఆసక్తికర విషయం తోడైంది. -
ఎమర్జెన్సీ మరోసారి వాయిదా
బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. 1975ల నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. -
కవితా కృష్ణమూర్తికి లైఫ్టైమ్ అఛీవ్మెంట్ అవార్డు
శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, సీనియర్ నేపథ్య గాయని కవితా కృష్ణమూర్తి యూకే ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (యూకేఏఎఫ్ఎఫ్) జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. -
కేన్స్లో మన అందాలు
ఈ వేడుకలో నలుపు తెలుపు రంగుల కలబోతగా ఉన్న గౌను ధరించి ఆకట్టుకుంది ఐశ్వర్య. -
థియేటర్ల బంద్ వ్యక్తిగత నిర్ణయమే
‘తక్కువ వసూళ్లు వస్తున్నాయనే కారణంతో థియేటర్లు మూసివేయడం అనేది యాజమాన్యాలు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. -
దివ్యవతి దెయ్యం ఎందుకైంది?
‘‘కథ బాగుంటే ప్రేక్షకులు సినిమాల్ని తప్పకుండా చూస్తారు. మా చిత్రంతో మళ్లీ థియేటర్లకి కళ వస్తుంది’’ అన్నారు ఆశిష్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లవ్ మీ’. ఇఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య ఇప్పుడు ‘లవ్ మీ’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఎదురైన ప్రశ్నలపై ఆమె స్పందించారు. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ