Teja Sajja: తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది.
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మాత. భవిష్యత్తు అనే అర్థం వచ్చేలా ‘మిరాయ్’ అనే పేరుని ఈ సినిమాకి ఖరారు చేశారు. గురువారం ఫస్ట్లుక్ పోస్టర్తోపాటు, వీడియో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘‘సమ్రాట్ అశోక్. చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం. ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఓ దేవ రహస్యం. అదే మనిషిని దైవం చేసే తొమ్మిది గ్రంథాల అపార జ్ఞానం. తరాలుగా వాటిని కాపాడుతూ తొమ్మిది యోధుల నియామకం. అలాంటి జ్ఞానానికి చేరువవుతున్న ఓ గ్రహణం. ఆ గ్రహణాన్ని ఆపే ఓ జననం. ఇది తరాలుగా తప్పని మహారణం’గా కథని పరిచయం చేసింది ప్రచార చిత్రం. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం. దీని గురించి సినిమా విడుదల తర్వాత మరింత బాగా అర్థమవుతుంది. ఈ కథ కోసం చాలా నేర్చుకుని సినిమా చేస్తున్నా. ‘హను-మాన్’కి ముందే ఈ కథని తేజకి చెప్పా. పదేళ్లుగా తనతో ప్రయాణం చేస్తున్నా. ఇదొక అద్భుతమైన సినిమాగా మలుస్తున్నా. ఈ చిత్రంలో మంచు మనోజ్ ఓ కీలక పాత్రలో నటిస్తారు’’ అన్నారు. తేజ మాట్లాడుతూ ‘‘నన్నొక యోధుడిగా తెరపై చూపిస్తున్నారు కార్తీక్. ఆయన విజన్ గొప్పగా ఉంటుంది. ఆర్నెళ్ల కిందటే ఈ సినిమాని మొదలుపెట్టాం. వచ్చే ఏడాది విడుదల రోజు గుడ్ ఫ్రైడే. నాతోపాటు, అందరికీ అది గుడ్ ఫ్రైడే అవుతుంది. ‘హను-మాన్’ తర్వాత రిలాక్స్ అయిపోయావా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ప్రతి అడుగూ జాగ్రత్తగా వేసే క్రమంలోనే ఈ సినిమా చేస్తున్నా. మాకున్న వనరులతో భారీగా చేస్తున్నాం. టి.జి.విశ్వప్రసాద్ నిర్మాణంలో చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.
నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘‘కార్తీక్తో మా ప్రయాణం చాలా బాగుంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం తెరపై కన్నులపండుగలా ఉంటుంది. పాన్ వరల్డ్ రికార్డుల్ని సృష్టించే చిత్రం అవుతుంది’’ అన్నారు. ప్రముఖ నిర్మాత డి.సురేశ్బాబు మాట్లాడుతూ ‘‘కార్తీక్, తేజ, విశ్వప్రసాద్... ఈ ముగ్గురి కల ఈ సినిమాతో నెరవేరుతుంది. గౌర హరి సంగీతం చాలా బాగుంది. అందరూ కలిసి ఓ అద్భుతమైన సినిమాని అందిస్తున్నారని ప్రచార చిత్రం స్పష్టం చేస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు నందినిరెడ్డి, మల్లిక్ రామ్, కృష్ణచైతన్య, బెక్కం వేణుగోపాల్, ఎస్.కె.ఎన్, శ్రీరామ్ ఆదిత్య, సాహు గారపాటి, వివేక్ కూచిభొట్ల, కళా దర్శకుడు నాగేంద్ర, సంగీత దర్శకుడు గౌర హరి, ఇతర చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
ఎన్టీఆర్ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలై నేటికి 50 ఏళ్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలివీ.. -
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ప్రత్యేక కథనం. -
‘తుపాకీ పట్టి..’ బాక్సాఫీస్కు గురిపెట్టి!
కథానాయకులిచ్చే ప్రేమ గులాబీలు అందుకుంటూ.. వాళ్లతో చెట్టాపెట్టాలేసుకుని ఆడిపాడుతూ తెరపై హొయలొలికించే కథానాయికలు ఇప్పుడు తమలోని మరో కోణాన్ని పరిచయం చేస్తున్నారు. తుపాకీ పట్టి యాక్షన్ తూటాలు పేలుస్తూ బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. -
పెళ్లి తేలికైన విషయం కాదు!
‘‘అసభ్యతకు తావులేని మంచి వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇది ఒక చక్కటి జీవిత అనుభవాన్ని పంచుకునేలా ఆలోచింపజేసేలా ఉంటుంద’’న్నారు అబ్బూరి రవి. ఆయన రచయితగా వ్యవహరించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. -
బాహుబలి నుంచి యానిమేటెడ్ సిరీస్
ప్రభాస్ - రాజమౌళి కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘బాహుబలి’ సిరీస్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడీ ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి ఓ యానిమేటెడ్ సిరీస్ రానుంది. -
సీమ కథతో తొలిసారి
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్తో ఓ సినిమా చేయనున్నారు. -
అందర్నీ మెప్పించడం సాధ్యం కాదు
‘కెరీర్లో జయాపజయాలు సహజం. అవి ఎంతమాత్రం నాపై ప్రభావం చూపించవు. ప్రేక్షకులు మెచ్చేలా నటించుకుంటూ వెళ్లడమే నా పని’ అంటోంది అలయా ఎఫ్. ఇటీవలే తను నటించిన ‘బడేమియా ఛోటేమియా’ భారీ వసూళ్లు రాబట్టడం లేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విధంగా బదులిచ్చింది అలయా. -
వేడుకలా షబానా 50 ఏళ్ల సినీ ప్రయాణం
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ చలనచిత్ర పరిశ్రమలో విజయవంతంగా 50ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈమె ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎన్వైఐఫ్ఫ్) ఓ వేడుకను నిర్వహించనుంది. -
ముందుగానే ‘టర్బో’ రాక
వైవిధ్యమైన కథలు, పాత్రలతో అలరిస్తుంటారు మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి. ఇప్పుడాయన ‘టర్బో’ చిత్రంతో యాక్షన్ అవతారంలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైశాక్ తెరకెక్కిస్తున్న మాస్ చిత్రమిది. కొన్ని రోజుల క్రితం జూన్ 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య