Keerthy Suresh: ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం

ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్‌. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్‌’తో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది.

Updated : 26 Apr 2024 11:54 IST

చితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్‌. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్‌’తో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. ఆమె, వరుణ్‌ ధావన్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంతో ఎ.కాలీస్‌ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తైన విషయాన్ని తెలుపుతూ.. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది కీర్తి. ‘‘విజయవంతంగా షూటింగ్‌ ముగిసింది. ‘బేబీ జాన్‌’ త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాడు’ అనే వ్యాఖ్యల్ని జోడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని