Kiara Advani: బోర్డర్‌లో కియారా.. జవాన్లతో కలిసి సరదాగా

నటి కియారా కియారా అడ్వాణీ (Kiara Advani) వాఘా సరిహద్దుకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.

Published : 09 Aug 2023 10:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి కియారా అడ్వాణీ (Kiara Advani) వాఘా సరిహద్దు (Wagah border)ల్లో జవాన్లను కలిశారు. ఆమె నటిస్తోన్న తాజా చిత్రం షూటింగ్‌ అమృత్‌సర్‌లో జరుగుతోంది. దీంతో కియారా దగ్గర్లోని వాఘా బోర్డర్‌కు వెళ్లారు. త్రివర్ణపతాకాన్ని చేతబట్టి దేశభక్తిని చాటుకున్నారు. జవాన్‌లతో సరదాగా ముచ్చటించి.. వారితో కలిసి ఫొటోలు దిగారు. ఆ ప్రాంతంలో మొక్కను కూడా నాటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

అనుకోకుండా తెరంగేట్రం చేసి.. సూపర్‌స్టార్‌గా నిలిచి: మహేశ్‌బాబు బర్త్‌డే స్పెషల్‌

ఇక కియారా సినిమాల విషయానికొస్తే ఇటీవలే  ‘సత్య ప్రేమ్‌ కీ కథా’ (Satyaprem ki katha) చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. అలాగే రామ్‌ చరణ్‌ సరసన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ (Shankar) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను కియారా పంచుకున్నారు. ఈ ఏడాది చివరికి ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ పూర్తయ్యే అవకాశమున్నట్లు తెలిపారు. అవుట్‌పుట్‌ అద్భుతంగా వస్తుందని.. ప్రేక్షకుల ఊహకు మించి ఈ సినిమా ఉంటుందంటూ ఆసక్తిని రేకెత్తించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని