OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన రెండు కొత్త చిత్రాలు.. థ్రిల్లర్ ప్రియులకు వీకెండ్ వినోదం..!
ఓటీటీ వేదికగా ఈ వీకెండ్లో వినోదం అందించేందుకు రెండు కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.
వీకెండ్లో క్రైమ్, హారర్ చిత్రాలు చూడాలనుకునే వారి కోసం ఓటీటీలో రెండు కొత్త సినిమాలు విడుదలయ్యాయి. అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ వేదికగా నేటి నుంచి ఆ చిత్రాలు ప్రసారం అవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏమిటి? వాటి కథ ఏమిటి?
‘కొలై’ రిలీజ్.. కండిషన్స్ అప్లై..!
‘బిచ్చగాడు’తో తెలుగువారికి చేరువైన కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony). ఆయన నటించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘కొలై’ (Kolai). బాలాజీ కె.కుమార్ దీన్ని తెరకెక్కించారు. రితికాసింగ్ కథానాయిక. జులై 21న ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ‘హత్య’ అనే పేరుతో విడుదల చేశారు. థియేటర్లలో మిశ్రమ స్పందనలు అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా శుక్రవారం నుంచి ‘కొలై’ అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతానికి తమిళ ఆడియోలోనే సినిమా ప్లే అవుతోంది. తెలుగు ఆడియో వచ్చేవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఓటీటీలో ‘బేబీ’ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. వాళ్లకు స్పెషల్!
కథేంటంటే:
లైలా (మీనాక్షి చౌదరి) ఫేమస్ మోడల్. హైదరాబాద్లోని తన ఫ్లాట్లో హత్యకు గురవుతుంది. ఆ కేసు దర్యాప్తును ఐపీఎస్ అధికారిణి సంధ్య (రితికా సింగ్)కు అప్పగిస్తారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేని ఆ కేసును పరిష్కరించేందుకు ఆమె డిటెక్టివ్ వినాయక్ (విజయ్ ఆంటోని) సహాయాన్ని కోరుతుంది. ఈ కేసు విచారించే క్రమంలో లైలా హత్యకు ఆమె బాయ్ ఫ్రెండ్ సతీష్ (సిద్ధార్థ్ శంకర్), ముంబయిలో ఉన్న మోడల్ కో-ఆర్డినేటర్ ఆదిత్య కౌశిక్ (మురళీ శర్మ), ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవ్ (అర్జున్ చిదంబరం), బబ్లూ (కిషోర్ కుమార్) అనే మరో వ్యక్తికి ఏదో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తారు. మరి ఈ నలుగురిలో లైలాను హత్య చేసిందెవరు? అసలు నేరస్థుల్ని వినాయక్, సంధ్య ఎలా కనిపెట్టారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి? అనే ఆసక్తికర అంశాలతో ఇది రూపుదిద్దుకుంది.
అవికాగోర్ కొత్త సినిమా..!
అవికాగోర్ (Avikagor) నటించిన బాలీవుడ్ చిత్రం ‘1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్’. హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి కృష్ణభట్ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. తాజాగా ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా విడుదలైంది. ప్రస్తుతం హిందీ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది.
కథేంటంటే:
తన తండ్రి ధీరజ్ అకాల మరణంతో మేఘన (అవికాగోర్) మనోవేదనకు గురి అవుతుంది. ధీరజ్ రాసిన ఓ పాత డైరీని మేఘన అనుకోకుండా చదువుతుంది. తండ్రి మరణానికి తన తల్లే కారణమని తెలుసుకుంటుంది. తన తల్లిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. తల్లిపై పగ తీర్చుకోవడానికి మేఘన ఏం చేసింది? పగ తీర్చుకునే క్రమంలో ఆమె తన ప్రియుడు అర్జున్ను ఎలా దూరం చేసుకుంది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘విద్యా వాసుల అహం’ నేరుగా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
‘విద్యా వాసుల అహం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఎప్పుడంటే? -
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
విక్కీ కౌశల్, సారా అలీఖాన్ కీలక పాత్రల్లో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ‘జర హట్కే జర బచ్కే’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్ సందర్భంగా రాజమౌళి ప్రత్యేక సందేశమిచ్చారు. -
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అదాశర్మ కీలక పాత్రలో నటించిన ‘బస్తర్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. -
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
2024లో వరుస హిట్స్తో మలయాళ చిత్ర పరిశ్రమ కళకళలాడిపోతోంది. కేవలం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన పలు చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్లోనూ చేరాయి. ఇప్పటివరకూ ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకున్న టాప్-5 మలయాళీ చిత్రాలేంటో చూసేయండి. -
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
నేరుగా ఓటీటీలోకి వరుణ్ సందేష్ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ సందేష్ నటించని క్రైమ్ సస్పెన్స్ డ్రామా ‘చిత్రం చూడర’ నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
త్రిగుణ్ కీలక పాత్రలో నటించిన ‘లైన్ మ్యాన్’ మూవీ ప్రస్తుతం తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాధవన్ నెగెటివ్ షేడ్స్లో నటించిన ‘షైతాన్’ ఓటీటీలోకి రానుంది. -
‘పంచాయత్ సీజన్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘పంచాయత్ సీజన్ 3’ వెబ్సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే? -
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కొత్తదనం నిండిన రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మమితా బైజు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రణయ విలాసం’. ఈటీవీ విన్ వేదికగా ఇది ప్రసారం కానుంది. -
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
తండేల్ మూవీ ఓటీటీ డీల్ పూర్తయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది.